త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | ప్ర‌తి గింజ‌నూ ప్ర‌భుత్వ‌మే కొంటుంది: మంత్రి తుమ్మ‌ల‌

Tummala Nageshwar Rao | రాష్ట్రంలో పండిన ప్ర‌తి గింజ‌నూ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి త‌మ్మ‌ల నాగేశ్వ‌ర్‌ రావు ప్ర‌క‌టించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం అదనంగా మరో రూ.1800 కోట్లు కేటాయించామ‌న్నారు.

S

Telangana | Published On May 24, 2026, 1.09 pm IST

Tummala Nageshwar Rao | ప్ర‌తి గింజ‌నూ ప్ర‌భుత్వ‌మే కొంటుంది: మంత్రి తుమ్మ‌ల‌
Advertisement
  • జొన్నల కొనుగోలుకు రూ.1,100 కోట్లు
  • మ‌క్క‌లకు అద‌నంగా రూ. 18,00 కోట్లు కేటాయించాం

త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో పండిన ప్ర‌తి గింజ‌నూ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి త‌మ్మ‌ల నాగేశ్వ‌ర్‌ రావు ప్ర‌క‌టించారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌లో సాగైన జొన్న‌ల కొనుగోళ్ల‌కు ప్ర‌భుత్వం రూ.1100 కోట్లు కేటాయించిన‌ట్లు వివ‌రించారు. ఈమేర‌కు ఆదివారం ఆయ‌న మాట్లాడారు.

మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఇప్పటికే రూ. 4 వేల కోట్లు కేటాయించాం. మ‌ళ్లీ అదనంగా మరో రూ.1800 కోట్లు కేటాయించాం. భారీ దిగుబడుల నేపథ్యంలో మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నాం. రూ.1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Advertisement
Advertisement