Godavari Floods | గోదావరి వరద ఉద్ధృతిపై అప్రమత్తం.. కలెక్టర్కు మంత్రి పొంగులేటి ఆదేశాలు..
Godavari Floods | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
Godavari Floods | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్తో మంత్రి ఫోన్లో మాట్లాడి వరద పరిస్థితిని సమీక్షించారు. భద్రాచలం వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతున్నందున పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రజాప్రతినిధులను కూడా సహాయక చర్యల్లో భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
వరద ముప్పు పొంచి ఉన్న గ్రామాల ప్రజలను అవసరమైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని మంత్రి సూచించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్యం, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ, వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. భారీగా వరద నీరు చేరుతున్న జలాశయాల పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి, దిగువ ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు.
48 అడుగులకు చేరిన గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఖమ్మం కలెక్టర్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండగా, 11,44,507 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి రక్షణ : సీఎం రేవంత్రెడ్డి
- ●Raashii Khanna | ధర్మన్ షూటింగ్లో రాశీఖన్నాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
- ●Tirumala Brahmotsavam | సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- ●వైన్ అంటే కేవలం డ్రింక్ అనుకుంటివా... అదో వైబ్! వైన్ సీక్రెట్ హిస్టరీ ఇదే!
- ●Family Certificate | అందుబాటులోకి 'ఫ్యామిలీ సర్టిఫికెట్'.. ఎక్కడ పొందాలో తెలుసా..?
- ●Tummala Nageswara Rao | ఆయిల్పామ్ విస్తరణలో అలసత్వం సహించం : మంత్రి తుమ్మల

CM Revanth Reddy | తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి రక్షణ : సీఎం రేవంత్రెడ్డి

Raashii Khanna | ధర్మన్ షూటింగ్లో రాశీఖన్నాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్

Tirumala Brahmotsavam | సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

వైన్ అంటే కేవలం డ్రింక్ అనుకుంటివా... అదో వైబ్! వైన్ సీక్రెట్ హిస్టరీ ఇదే!




