Godavari Fierce Flood | గోదావరి ఉగ్రరూపం.. ఇసుక పాయల్లో చిక్కుకున్న 38 మంది
Godavari Fierce Flood | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలో గోదావరి నది ఉద్ధృతి పెరగడంతో ఇసుక క్వారీలో 38 మంది చిక్కుకున్నారు. నది మధ్యలో ఉన్న ఇసుక పాయల్లో చిక్కుకున్న వారిలో 30 మందికి పైగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఐదుగురు మిషన్ ఆపరేటర్లతో పాటు స్థానికులు ఉన్నారు.
Godavari Fierce Flood | త్రినేత్ర.న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురం సమీపంలో గోదావరి నది ఉద్ధృతి పెరగడంతో ఇసుక క్వారీలో 38 మంది చిక్కుకున్నారు. నది మధ్యలో ఉన్న ఇసుక పాయల్లో చిక్కుకున్న వారిలో 30 మందికి పైగా లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఐదుగురు మిషన్ ఆపరేటర్లతో పాటు స్థానికులు ఉన్నారు. వీరాపురం ఇసుకపాయల్లోకి వరద నీరు అనూహ్యంగా వచ్చి చేరడంతో అప్పటికే కొందరు లారీలతో బయటకు వచ్చారు.
ఉన్నట్టుండి క్వారీలోకి ఒక్కసారిగా వరద నీరు వేగంగా వచ్చి చేరింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ రాజవర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఇసుకపాయల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు పడవలను పంపించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో చర్ల - ములుగు జిల్లా వెంకటపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదలు తగ్గుముఖం పట్టేవరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటి కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయని ఆశ చూపారు.. అప్పనంగా రూ.33 లక్షలు కాజేశారు
జులై 31, 2026

Dasoju Sravan Kumar | బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫలితమే
జులై 31, 2026

KTR | ఈ-కార్ రేసు కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్.. విచారణ వాయిదా
జులై 31, 2026
తాజావార్తలు
- ●Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి
- ●Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయని ఆశ చూపారు.. అప్పనంగా రూ.33 లక్షలు కాజేశారు
- ●OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Delhi Police | మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయపడ్డ పోలీసు కుటుంబాలు
- ●Income Tax | రూ.50వేలకు పైగా విలువైన వస్తువును లేదా డబ్బును గిఫ్ట్గా అందుకున్నారా.. ఇలా చేస్తే పన్ను ఉండదు..
- ●Dasoju Sravan Kumar | బంకర్ బెడ్ల కుంభకోణంపై రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు.. ‘పెద్ది’ పోరాట ఫలితమే

Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి

Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయని ఆశ చూపారు.. అప్పనంగా రూ.33 లక్షలు కాజేశారు

OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..

Delhi Police | మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయపడ్డ పోలీసు కుటుంబాలు



