త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Santosh Kumar | మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం

Santosh Kumar | ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో రేపు (ఏప్రిల్ 17న) అందుకోనున్నారు.

S

Telangana | Published On Apr 16, 2026, 6.31 pm IST

Santosh Kumar | మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌కు గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారం
Advertisement

బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో రేపే ప్రదానం

Santosh Kumar | త్రినేత్ర.న్యూస్ : ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో రేపు (ఏప్రిల్ 17న) అందుకోనున్నారు. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడంలో 'ఇగ్నైటింగ్ మైండ్స్' స్వచ్ఛంద సంస్థకు ఆయన వ్యవస్థాపకులు. ఆయన "హరా హై తో భరా హై" (ఆకుపచ్చగా ఉంటేనే సిరిసంపదలు) నినాదంతో ముందుకొచ్చిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' దేశవ్యాప్తంగా పర్యావరణ బాధ్యతను ఒక సత్సంప్రదాయంగా మార్చింది. ఎంతోమంది ఈ ఉద్యమంలో భాగస్వాములై మిలియన్ల కొద్దీ మొక్కలు నాటారు.

లండన్‌లో వేడుక

పర్యావరణ పరిరక్షణ,సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై పోరాడుతున్న ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించి వారికి పురస్కారాలు అందిస్తున్న బ్రిటన్ సంస్థ హెలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్ రేపు (ఏప్రిల్ 17న) అంతర్జాతీయ కాన్ క్లేవ్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో సంతోష్ కుమార్‌కు 'గ్లోబల్ గ్రీన్ ఐకాన్' పురస్కారాన్ని అందజేస్తారు.

Advertisement
Advertisement