Fuel Supply Hike | పెట్రోల్ బంకుల వద్ద రద్దీ.. సరఫరాను 126శాతం పెంచిన పౌరసరఫరాలశాఖ..!
Fuel Supply Hike | రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఇంధన సరఫరాను 126 శాతం పెంచింది. బంకుల వద్ద రద్దీ, పొరుగు రాష్ట్రాల ప్రభావం, ధరలపై పుకార్లు కారణంగా డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు అవసరానికి తగినంత మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
Fuel Supply Hike | హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీ, ఆకస్మిక డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలంగాణ వ్యాప్తంగా ఇంధన సరఫరాను 126 శాతం పెంచింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంధన పంపిణీ పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. పరిశ్రమలకు ఉపయోగించే డీజిల్ ధర ఇటీవల లీటరుకు రూ.150కు పెరగడంతో, తక్కువ ధరకు లభించే సాధారణ పెట్రోల్ బంకుల వైపు పెద్ద వినియోగదారులు మొగ్గుచూపారు. దీంతో బంకుల వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
సరఫరా వేగవంతం..
అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో సరఫరా సమస్యలు తలెత్తడంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ప్రజలు తెలంగాణ బంకులకు పెద్ద సంఖ్యలో రావడం కూడా డిమాండ్ పెరగడానికి కారణమైంది. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే అపోహలు కూడా ప్రజల్లో భయాన్ని కలిగించి, అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవడంతో పరిస్థితి మరింత ఒత్తిడిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఆయిల్ కంపెనీలకు తగిన నిల్వలు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,100 ట్యాంకర్లను వినియోగంలోకి తీసుకొచ్చి సరఫరాను వేగవంతం చేస్తున్నారని పౌరసరఫరాలశాఖ తెలిపింది.
నిల్వలపై సమీక్ష..
ప్రతి మూడు గంటలకు బంకుల నిల్వలపై పర్యవేక్షణ చేపట్టడంతో పాటు రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, రైతులకు ఇబ్బంది లేకుండా పంట కోతలు, కొనుగోలు ప్రక్రియ కొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సరఫరా పెంపు తర్వాత గణనీయమైన మార్పులు వచ్చాయని వివరించింది. డీజిల్ సరఫరా 151 శాతం పెరిగి 18,449 కిలో లీటర్లకు చేరగా.. పెట్రోల్ సరఫరా దాదాపు రెట్టింపు స్థాయిలో 11,490 కిలో లీటర్లకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను 43 శాతం పెంచారు. డీజిల్, పెట్రోల్ నిల్వలు వరుసగా 46 శాతం, 40 శాతం మేర పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలు పుకార్లను నమ్మకుండా అవసరమున్న మేరకు ఇంధనాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



