Kalvakuntla Kavitha | స్వేచ్ఛ అనేది ఉచితంగా వచ్చేది కాదు.. పోరాడి సాధించుకోవాలి
Kalvakuntla Kavitha | మన నేల స్వాతంత్య్రం కోసం ఒక్కసారి కంటే ఎక్కువే పోరాడిందని.. స్వేచ్ఛ అనేది ఎప్పుడూ ఉచితంగా రాదని, దాన్ని పోరాడి సాధించుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కింగ్ చార్లెస్-III క్షమాపణ సాధించడమే తన జీవిత ఆశయంగా మలుచుకుంటానని ప్రకటించారు.
- అదే తెలంగాణ రక్షణ సేన స్ఫూర్తి, నేను మాట్లాడుతున్న స్ఫూర్తి
- స్వాతంత్య్రం బ్రిటిష్ సామ్రాజ్యం ఇచ్చిన బహుమతి కాదు
- కింగ్ చార్లెస్- III భారత్కు బహిరంగ క్షమాపణ చెప్పాలి
- ఆ క్షమాపణ సాధించడమే నా జీవిత ఆశయం
- ఎక్స్ వేదికగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha | త్రినేత్ర.న్యూస్: మన నేల స్వాతంత్య్రం కోసం ఒక్కసారి కంటే ఎక్కువే పోరాడిందని.. స్వేచ్ఛ అనేది ఎప్పుడూ ఉచితంగా రాదని, దాన్ని పోరాడి సాధించుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ ప్రతి జ్ఞాపకాన్ని తన రక్తంలో నిలుపుకుందన్నారు. కింగ్ చార్లెస్-III క్షమాపణ సాధించడమే తన జీవిత ఆశయంగా మలుచుకుంటానని ప్రకటించారు. బ్రిటన్కు దోచుకెళ్లిన ప్రతి కళా ఖండాన్ని వెకన్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. 80వ స్వాతంత్య్ర వేడుకలన పురస్కరించుకొని శనివారం ఆమె ఎక్స్ వేదికగా మాట్లాడారు.
పట్టుకెళ్లిన ప్రతి కళాఖండాన్ని వెనక్కి ఇవ్వండి..
మన స్వాతంత్య్ర సమరయోధులు, భారతదేశం క్షమాపణకు అర్హత కలిగి ఉంది. అందువల్ల నేను బ్రిటిష్ క్రౌన్ (రాచరికం), కింగ్ చార్లెస్ IIIను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. భారత్కు బహిరంగ క్షమాపణ చెప్పండి. మీ చరిత్ర పుస్తకాలను తిరగరాయండి. మీ ప్రజలకు మీ వలస పాలన గురించి నిజాలు చెప్పండి. భారతదేశం నుండి మీరు దోచుకున్న ప్రతి కళాఖండాన్ని వెనక్కి ఇవ్వండి.
రక్తం చిందించాం..
ఈరోజు మనం వారసత్వంగా పొందిన స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్నాం. ఈ తరుణంలో స్వాతంత్య్రం జరుపుకునే రోజును చూడకుండానే ప్రాణాలు కోల్పోయిన కోట్లాది మందిని స్మరించుకుందాం. స్వాతంత్య్రం బ్రిటిష్ సామ్రాజ్యం ఇచ్చిన బహుమతి కాదు. దాని కోసం పోరాడాం.. రక్తం చిందించాం. తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. రైతులు, కార్మికులు, విప్లవకారులు దోపిడీ, కారాగార శిక్షలు, కరువు కాటకాలు, మరణాలను ఎదుర్కొన్నారు.
త్రివర్ణ పతాకం నీడలో స్వేచ్ఛగా నిలబడటం కోసం..
బెంగాల్ కరువు నుండి జలియన్వాలా బాగ్ వరకు మన బాధలను చరిత్రలో ఎప్పటికీ ఒక చిన్న పాదగీతికగా కుదించొద్దు. స్వేచ్ఛను పోరాడి సాధించుకోవాలని మనకు తెలుసు. అదే తెలంగాణ రక్షణ సేన స్ఫూర్తి, ఈరోజు నేను మాట్లాడుతున్న స్ఫూర్తి. కేవలం సత్యాన్నే మాట్లాడండి. క్షమాపణ చెబితే మరణించిన వారు వెనక్కి రారు. కానీ ఈ త్రివర్ణ పతాకం నీడలో మనం స్వేచ్ఛగా నిలబడటం కోసం, సర్వస్వం త్యాగం చేసిన ప్రతి భారతీయుడి కోసం ఆ క్షమాపణను సాధించడమే నా జీవితాశయంగా మలచుకుంటాను అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్
ఆగస్టు 15, 2026

Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
ఆగస్టు 15, 2026

Ponnam Prabhakar | స్వాతంత్య్రమంటే విముక్తి పొందడమే కాదు.. ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు అందడం
ఆగస్టు 15, 2026
తాజావార్తలు
- ●KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్
- ●Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్కు ప్లాన్!
- ●Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం హార్ట్ టచింగ్ లవ్స్టోరీ - పెళ్లికి ముందు యాక్సిడెంట్ - ఆత్మగా ప్రియుడు తిరిగొస్తే!
- ●Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు
- ●NALSAR student body | బీసీఐ చైర్మన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. నల్సార్ స్టూడెంట్స్
- ●Rashmika Mandanna | రష్మిక మందన్న కోసం అల్లు అర్జున్ రాకా షూటింగ్ ఆపేసిన డైరెక్టర్

KTR | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : కేటీఆర్

Bengaluru Terror Arrest | బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం: తాలిబన్లతో కలిసి పాకిస్థాన్ ఆర్మీపైనే అటాక్కు ప్లాన్!

Telugu OTT | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం హార్ట్ టచింగ్ లవ్స్టోరీ - పెళ్లికి ముందు యాక్సిడెంట్ - ఆత్మగా ప్రియుడు తిరిగొస్తే!

Accident | బైకును ఢీకొట్టిన లారీ.. బాలిక దుర్మరణం.. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు



