త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakesh Reddy | ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయండి.. డీజీపీని కోరిన నిరుద్యోగులు

Rakesh Reddy | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీసు ఉద్యోగాల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయాల‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. రాకేశ్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగ జేఏసీ నాయ‌కులు, పోలీసు ఉద్యోగాల అభ్య‌ర్థులు, నిరుద్యోగులు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను క‌లిసి విన‌త‌ప‌త్రం అంద‌జేశారు.

S

Telangana | Published On Jun 9, 2026, 4.30 pm IST

Rakesh Reddy | ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయండి.. డీజీపీని కోరిన నిరుద్యోగులు
Advertisement

Rakesh Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల పోలీసు ఉద్యోగాల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయాల‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి పెంచాల‌ని కోరారు. ఈ మేర‌కు రాకేశ్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగ జేఏసీ నాయ‌కులు, పోలీసు ఉద్యోగాల అభ్య‌ర్థులు, నిరుద్యోగులు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను క‌లిసి విన‌త‌ప‌త్రం అంద‌జేశారు.

అనంత‌రం రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు కానిస్టేబుల్‌కు 36 ఏళ్లు, ఎస్సైకి 38 ఏళ్ల వ‌ర‌కు వ‌యోప‌రిమితిని పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జీవో నెంబ‌ర్ 46ను ర‌ద్దు చేసి గ్రామీణ ప్రాంత అభ్య‌ర్థుల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా చూడాల‌ని సూచించారు.

Advertisement
Advertisement