త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి.. కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌

Suicide | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆ తండ్రికి ఏం క‌ష్టం వ‌చ్చిందో ఏమోగానీ ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నిజాంసాగ‌ర్‌లో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.

S

Telangana | Published On Jun 12, 2026, 4.03 pm IST

Suicide | ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి.. కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌
Advertisement

Suicide |త్రినేత్ర‌.న్యూస్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆ తండ్రికి ఏం క‌ష్టం వ‌చ్చిందో ఏమోగానీ ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నిజాంసాగ‌ర్‌లో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. దీంతో తండ్రి, పిల్ల‌లు స‌హా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌తో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

పోలీసుల ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో ఓ తండ్రి, ఇద్దరు పిల్లలతో క‌లిసి దూక‌డంతో మృతి చెందారు. బంధువులు ఇచ్చిన‌ సమాచారంతో ప్రాజెక్టులో రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ముగ్గురి మృతదేహాల‌ను వెలికితీశాం. మృతిచెందిన వారిని తండ్రి కృష్ణ (32), కుమారుడు రక్షిత్ (8), కుమార్తె అనన్య (5)గా గుర్తించాం. వీరు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన‌వారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement