త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad Reporters | నిజామాబాద్‌లో రిపోర్టర్ల ‘వసూల్’ దందా: సీపీ పేరు చెప్పి బెదిరింపులు.. ఐదుగురిపై కేసు నమోదు!

నిజామాబాద్ జిల్లాలో కలకలం.. హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై ప్రముఖ ఛానెళ్ల రిపోర్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సీపీ పేరు చెప్పి దందాకు పాల్పడటంతో అధికారులు సీరియస్ అయ్యారు.

J

Telangana | Published On Jan 13, 2026, 2.07 pm IST

Nizamabad Reporters | నిజామాబాద్‌లో రిపోర్టర్ల ‘వసూల్’ దందా: సీపీ పేరు చెప్పి బెదిరింపులు.. ఐదుగురిపై కేసు నమోదు!
Advertisement

Nizamabad Reporters | జిల్లాలో మీడియా ముసుగులో సాగుతున్న అక్రమ వసూళ్ల దందా బట్టబయలైంది. ఓ హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో ప్రముఖ టీవీ ఛానెళ్లు, పత్రికలకు చెందిన రిపోర్టర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సాక్షాత్తూ పోలీస్ కమిషనర్ (CP) పేరు చెప్పి దందాలకు పాల్పడటంతో ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

అసలేం జరిగిందంటే?

నిజామాబాద్‌ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ మేనేజ్‌మెంట్‌ను నిందితులు గత కొంతకాలంగా బెదిరిస్తున్నట్లు సమాచారం. హోటల్ లో తనిఖీలు చేయిస్తామని, ఇబ్బందులు సృష్టిస్తామని భయపెడుతూ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పోలీస్ కమిషనర్ పేరును వాడుకుని, ఆయన చెప్పినట్లుగా నమ్మిస్తూ యాజమాన్యం నుంచి డబ్బులు లాగినట్లు బాధితులు వాపోయారు.

బాధిత హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు నిజామాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. సీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిపై కేసులు నమోదు చేశారు:

సీపీ సీరియస్ హెచ్చరిక

పోలీసు అధికారుల పేరు వాడుకుని ఎవరైనా బెదిరింపులకు లేదా వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement