త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mancherial | ప‌సికందుకు కాలం చెల్లిన ఇంజెక్ష‌న్‌.. మంచిర్యాల ద‌వాఖాన‌లో దారుణం..

Mancherial | మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలో దారుణం జ‌రిగింది. హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న ప‌సికందుకు కాలం చెల్లిన ఇంజెక్ష‌న్ (Expired) ఇచ్చారు.

G

Telangana | Published On Apr 8, 2026, 11.15 am IST

Mancherial | ప‌సికందుకు కాలం చెల్లిన ఇంజెక్ష‌న్‌.. మంచిర్యాల ద‌వాఖాన‌లో దారుణం..
Advertisement

Mancherial | త్రినేత్ర‌.న్యూస్‌: మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలో దారుణం జ‌రిగింది. హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న ప‌సికందుకు కాలం చెల్లిన ఇంజెక్ష‌న్ (Expired) ఇచ్చారు. ద‌వాఖాన సిబ్బంది త‌ప్పును స‌రిదిద్దుకోక‌పోగా ప్ర‌శ్నించిన త‌ల్లిదండ్రుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించారు.

మార్చి 1న పూజిత‌, శ్ర‌వ‌ణ్ కుమార్ దంప‌తుల‌కు బాబు జ‌న్మించారు. చిన్నారికి ఊపిరితిత్తుల స‌మ‌స్య (Lungs Problems) త‌లెత్త‌డంతో కుటుంబ స‌భ్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని పిల్లల ద‌వాఖాన‌లో చేర్పించారు. చికిత్స సంద‌ర్భంగా వైద్య సిబ్బంది చిన్నారికి ఓ ఇంజక్షన్ వేశారు. అయితే దానిని పరిశీలించిన కుటుంబ సభ్యులు.. అది కాలం చెల్లిపోయింద‌ని, బాటిల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ డేట్‌ను మార్చిన‌ట్లు గుర్తించారు. దీంతో బాబు తండ్రి, కుటుంబ సభ్యులు ఆగ్ర‌హంతో వైద్యుడిని, సిబ్బందిని నిలదీశారు. అయితే వారు బాధితులతో దురుసుగా ప్రవర్తించ‌డ‌మే కాకుండా, దుర్భాష‌లాడిన‌ట్లు తెలుస్తున్న‌ది. దీంతో బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. హాస్పిట‌ల్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement