త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jeevan Reddy | వెల్‌డ‌న్ జీవ‌న్ రెడ్డి.. వెన్ను త‌ట్టిన రాజీవ్ గాంధీ

Jeevan Reddy | అది 1991, మే 20.. జ‌గిత్యాల‌లోని ఎస్‌కేఎన్ఆర్ ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీ గ్రౌండ్.. జ‌నాల‌తో క‌ళాశాల ప్రాంగ‌ణ‌మంతా కిక్కిరిసిపోయింది.. ఇసుకెస్తే రాల‌నంతా జ‌నం.. సాయంత్రం నాలుగైదు గంట‌ల‌కు మాజీ ప్ర‌ధాని, నాటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాజీవ్ గాంధీ.. స‌భా వేదిక‌పైకి రానే వ‌చ్చారు. ఇక జ‌న‌సందోహాన్ని చూసి రాజీవ్ నోట మాట రాలేదు.. ఆ స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హిస్తున్న టీ జీవ‌న్ రెడ్డిని భుజం త‌ట్టి.. వెల్‌డ‌న్ జీవన్ రెడ్డి అని ప్ర‌శంసించారు.

S

Telangana | Published On Apr 19, 2026, 8.30 pm IST

Jeevan Reddy | వెల్‌డ‌న్ జీవ‌న్ రెడ్డి.. వెన్ను త‌ట్టిన రాజీవ్ గాంధీ
Advertisement

Jeevan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : అది 1991, మే 20.. జ‌గిత్యాల‌లోని ఎస్‌కేఎన్ఆర్ ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీ గ్రౌండ్.. జ‌నాల‌తో క‌ళాశాల ప్రాంగ‌ణ‌మంతా కిక్కిరిసిపోయింది.. ఇసుకెస్తే రాల‌నంతా జ‌నం.. సాయంత్రం నాలుగైదు గంట‌ల‌కు మాజీ ప్ర‌ధాని, నాటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాజీవ్ గాంధీ.. స‌భా వేదిక‌పైకి రానే వ‌చ్చారు. ఇక జ‌న‌సందోహాన్ని చూసి రాజీవ్ నోట మాట రాలేదు.. ఆ స‌భ‌కు అధ్య‌క్ష‌త వ‌హిస్తున్న టీ జీవ‌న్ రెడ్డిని భుజం త‌ట్టి.. వెల్‌డ‌న్ జీవన్ రెడ్డి అని ప్ర‌శంసించారు. ఎందుకంటే.. అప్ప‌టి వ‌ర‌కు రాజీవ్ గాంధీ స‌భ‌ల‌కు అంత పెద్ద ఎత్తున జ‌నాలు రాలేదు.. ఏ నాయ‌కుడు కూడా ఆ స్థాయిలో జ‌నాన్ని స‌మీక‌రించ‌లేదు. స‌భా ప్రాంగ‌ణం జ‌నాల‌తో నిండిపోవ‌డంతో.. స‌మీపంలో, ర‌హ‌దారుల‌పై చీమ‌ల‌దండులా బారులు తీరిన జ‌నాన్ని చూసి.. రాజీవ్ గాంధీ అబ్బుర‌ప‌డిపోయి జీవ‌న్ రెడ్డిని ప్ర‌శంసించారు. నాటి ప్ర‌శంస జీవ‌న్ రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానంలో గుర్తుండిపోయే చిరకాల తీపి జ్ఞాప‌కం.

మ‌రో మరుపురాని జ్ఞాప‌కానికి..

నాడు జీవ‌న్ రెడ్డిని రాజీవ్ గాంధీ వెన్నుత‌ట్టి ప్ర‌శంసించిన వేదిక‌నే మ‌రో మ‌రుపురాని జ్ఞాప‌కానికి వేదిక కానుంది. నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడి.. అదే నాలుగు దశాబ్దాలుగా స్నేహ‌పూర్వ‌కంగా ఉన్న గులాబీ అధినేత కేసీఆర్ స‌మ‌క్షంలో జీవ‌న్ రెడ్డి బీఆర్ఎస్ కండువా క‌ప్పుకోనున్నారు. అయితే నాటి ఎస్‌కేఎన్ఆర్ ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ప్రాంగ‌ణం ప్ర‌స్తుతం వివేకానంద స్టేడియంగా మారింది. ఇప్పుడు ఈ స్టేడియంలోనే జ‌గిత్యాల జైత్ర‌యాత్ర‌.. కాంగ్రెస్‌పై దండ‌యాత్రకు బీఆర్ఎస్ పార్టీ స‌మ‌ర శంఖారావం పూరించ‌నుంది. నాటి జ‌న‌స‌మీక‌ర‌ణ‌ను మించిపోయేలా.. రేప‌టి కేసీఆర్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌కు ల‌క్ష‌లాది మంది జ‌నం పోటెత్తే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement