త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Santosh Kumar | ర‌ఘు రాయ్ కెమెరా భార‌త‌దేశ‌పు ఆత్మ : మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్

Santosh Kumar | అద్వితీయ‌మైన నిజాయితీతో, భావోద్వేగంతో భార‌త‌దేశ‌పు ఆత్మ‌ను త‌న కెమెరాలో బంధించిన దిగ్గ‌జ ఫొటోగ్రాఫ‌ర్ ర‌ఘు రాయ్ మృతిప‌ట్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సంతాపం ప్ర‌క‌టించారు.

S

Telangana | Published On Apr 26, 2026, 5.07 pm IST

Santosh Kumar | ర‌ఘు రాయ్ కెమెరా భార‌త‌దేశ‌పు ఆత్మ : మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్
Advertisement

Santosh Kumar | త్రినేత్ర‌.న్యూస్ : అద్వితీయ‌మైన నిజాయితీతో, భావోద్వేగంతో భార‌త‌దేశ‌పు ఆత్మ‌ను త‌న కెమెరాలో బంధించిన దిగ్గ‌జ ఫొటోగ్రాఫ‌ర్ ర‌ఘు రాయ్ మృతిప‌ట్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సంతాపం ప్ర‌క‌టించారు. చారిత్రాక ఘ‌ట్టాల నుంచి నిత్య జీవితం గురించి ఆయ‌న ఫొటోలు అనేక క‌థ‌ల‌ను చెప్పాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దృశ్య క‌థ‌నంలో ఆయ‌న వార‌స‌త్వం రాబోయే త‌ర‌త‌రాల ఫొటోగ్రాఫ‌ర్ల‌కు, క‌ళాకారుల‌కు స్ఫూర్తినిస్తూనే ఉంటుంద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు, అభిమానుల‌కు సంతోష్ కుమార్ త‌న ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించారు. సుమారు 50కి పైగా ఫోటో పుస్తకాలను వెలువరించిన రఘు రాయ్, తన కెమెరా కేవలం బొమ్మలను మాత్రమే కాకుండా భారతదేశ ఆత్మను స్పృశిస్తుందని బలంగా నమ్మేవారు.

Advertisement
Advertisement