త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | నాలుగేళ్ల నా మ‌నోవేద‌న స్వామి వారి ద‌య‌తో తీరిపోయింది : క‌విత‌

Kalvakuntla Kavitha | నేను నాలుగు సంవత్సరాలుగా పడుతున్న మనోవేదన స్వామి వారి దయతో తీరిపోయింది అని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 6, 2026, 3.46 pm IST

Kalvakuntla Kavitha | నాలుగేళ్ల నా మ‌నోవేద‌న స్వామి వారి ద‌య‌తో తీరిపోయింది : క‌విత‌
Advertisement

Kalvakuntla Kavitha | త్రినేత్ర‌.న్యూస్ : నేను నాలుగు సంవత్సరాలుగా పడుతున్న మనోవేదన స్వామి వారి దయతో తీరిపోయింది అని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంత‌రం క‌విత మీడియాతో మాట్లాడారు.

సత్యం, న్యాయం, ధర్మం మావైపు ఉందని నేను చెప్తూ వచ్చాను స్వామి వారి దయతో కంప్లీట్‌గా క్లీన్ చిట్ వచ్చింది. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం ఆ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు, దయ ఉండాలని కోరుకున్నాను. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకున్న తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు, ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నాను అని క‌విత పేర్కొన్నారు. .

Advertisement
Advertisement