త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్.. కేసీఆర్ పదేళ్ల పాలన ఫలితమే ఈ విజయం

Niranjan Reddy | కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో రాష్ట్ర వ్య‌వ‌సాయ రంగం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. సాగునీరు లేక నెర్రెలు బారిన నేల‌.. ప‌చ్చ‌ని పైరుల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, 24 గంట‌ల విద్యుత్, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది.

S

Telangana | Published On Jan 9, 2026, 2.59 pm IST

Niranjan Reddy | వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్.. కేసీఆర్ పదేళ్ల పాలన ఫలితమే ఈ విజయం
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో రాష్ట్ర వ్య‌వ‌సాయ రంగం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. సాగునీరు లేక నెర్రెలు బారిన నేల‌.. ప‌చ్చ‌ని పైరుల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, 24 గంట‌ల విద్యుత్, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది. వ‌రి పంట ఉత్ప‌త్తిలో తెలంగాణ దేశంలోనే అగ్ర‌భాగాన నిలిచింది.

పదేళ్లలో తెలంగాణ వరి ఉత్పత్తిలో సాధించిన ప్రగతిపై తాజాగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

వ‌రి ఉత్ప‌త్తిలో రాష్ట్రం నంబ‌ర్ వ‌న్‌గా నిల‌వ‌డం.. కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న ఫ‌లిత‌మే ఈ విజయం అని పేర్కొన్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2014 - 15 నుండి 2024 - 25 కు సంబంధించి విడుదల చేసిన నివేదికనే దానికి సాక్ష్యం అని ఆయ‌న అన్నారు. సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, వంద శాతం పంటల కొనుగోళ్ల మూలంగా ఈ అద్భుత విజయం సాధ్య‌మైంద‌న్నారు. పంటల ఉత్పత్తులకు అవసరమైన గోదాంలతో పాటు, విద్యుత్ రంగాన్ని పునర్ వ్యవస్థీకరణ చేయడం దీనికి మరో కారణం అని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలోనే అత్యధికంగా 240 శాతం వృద్ధి రేటుకు కారణం పదేళ్ల కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ, రైతు అనుకూల విధానాలే అని తెలిపారు. తెలంగాణ తర్వాత మధ్యప్రదేశ్ 80 శాతం, యూపీ 25 శాతం, తమిళనాడు 20, పంజాబ్ 12 శాతం మాత్రమే వృద్ధి సాధించాయన్నారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ 13 శాతం, మణిపూర్ 25 శాతం, అస్సాం 12 శాతం, కర్ణాటక 11, ఒడిశా 8 శాతం పతనం చెందడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను దేశం అనుసరించాలి అని సూచించారు. రైతులకు, వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలని నిరంజ‌న్ రెడ్డి కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement