Harish Rao | రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా కంఠక పాలన అని తీవ్ర విమర్శలు గుప్పించారు హరీశ్రావు. ఈ రెండేండ్లలో ప్రజలకు వేదన, రోదనే మిగిలిందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు. రేవంత్ రెడ్డి ఓ బిల్డప్ బాబాయ్ మాదిరి తయారయ్యారని హరీశ్రావు విమర్శించారు.