త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ప‌రిపాల‌న‌ను ప‌ట్టాలెక్కించాల‌నేదే మా ఆలోచ‌న : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు తెలంగాణ‌ను అభివృద్ధిలో ప‌రుగులు పెట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు.

S

Hyderabad | Published On Dec 30, 2025, 7.37 pm IST

CM Revanth Reddy | ప‌రిపాల‌న‌ను ప‌ట్టాలెక్కించాల‌నేదే మా ఆలోచ‌న : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు తెలంగాణ‌ను అభివృద్ధిలో ప‌రుగులు పెట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల నియ‌మితులైన కొత్త జోన‌ల్ క‌మిష‌న‌ర్ల‌తో సీఎం రేవంత్ రెడ్డి స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి ఏరియాను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామ‌ని తెలిపారు.

క్యూర్( CURE) పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించాం. పరిపాలనను పట్టాలెక్కించాలనేదే మా ఆలోచన అని సీఎం తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. జోన్‌ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్‌ల‌దే. జోనల్ కమిషనర్లు ప్రతీ రోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందే. సిటీలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించాం. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వెహికిల్స్‌ను తీసుకురావాలని నిర్ణయించాం. సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన తీసుకుంటున్నాం. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించడానికి వీల్లేదు.. రోడ్లపై గుంతలు కనిపించొద్దు అని రేవంత్ ఆదేశించారు.

జనన మరణ ధ్రువీకరణ, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఆన్ లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడిక తీత పనులు జనవరి నుంచి మొదలు పెట్టాలి. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి అని అధికారుల‌కు సీఎం సూచించారు.

క్యూర్ ఏరియాలో విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టాలి. ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వీలైనంత స్పీడ్‌గా రెస్పాన్స్ అవ్వాలి. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్ బాగుంటుంది అని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement