త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రూ. 89 కోట్లు స‌హ‌జ పెరుగుద‌ల‌నే.. ఆరోగ్య‌శ్రీపై రేవంత్‌కు హ‌రీశ్‌రావు కౌంట‌ర్

Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు అమాంతం పెరిగిపోయాయ‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 26, 2026, 1.13 pm IST

Harish Rao | రూ. 89 కోట్లు స‌హ‌జ పెరుగుద‌ల‌నే.. ఆరోగ్య‌శ్రీపై రేవంత్‌కు హ‌రీశ్‌రావు కౌంట‌ర్
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు అమాంతం పెరిగిపోయాయ‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీపై శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి స‌మాధానం ఇచ్చిన అనంత‌రం అసెంబ్లీలో హ‌రీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు.

2014 జూన్ 2వ‌ తేదీ వరకు ఆరోగ్యశ్రీకి నెలకు రూ. 32 కోట్లు ఖర్చు అయ్యేవి. 2023 వరకు ఆ ఖర్చు రూ. 68 కోట్లకు పెరిగింది, ఇవాళ రూ. 89 కోట్లు అంటున్నారు. సహజ పెరుగుదల ఉంది కానీ, కొత్తగా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని హ‌రీశ్‌రావు ఆరోపించారు.

మేము చేపట్టిన ఆసుపత్రుల గురించి చెప్పారు.. కానీ పూర్తి చేయ‌డంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆసుపత్రులు ఎప్పుడో పూర్తయ్యేవి. సీఎంఆర్ఎఫ్ కోసం మేము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచాం. ఈ అంశాలు అన్నీ చెప్పాలని అనుకుంటే సభలో మాకు మైక్ ఇవ్వలేదు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement