త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | జాతీయ రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల్లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాలి: మంత్రి పొన్నం

Ponnam Prabhakar | తెలంగాణ (Telangana) రవాణా శాఖ (Transport Department) పక్షాన జనవరి 1 నుండి 31వ తేదీ వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో (National Road Safety Month) ప్రతి ఒక్కరు పాల్గొనాలని రాష్ట్ర ర‌వాణాశాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు.

A

Telangana | Published On Dec 31, 2025, 1.32 pm IST

Ponnam Prabhakar | జాతీయ రోడ్డు భ‌ద్ర‌తా మాసోత్స‌వాల్లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాలి: మంత్రి పొన్నం
Advertisement

Ponnam Prabhakar | రేప‌టి నుంచి జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో (National Road Safety Month) ప్రతి ఒక్కరు పాల్గొనాలని రాష్ట్ర ర‌వాణాశాఖ‌, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. తెలంగాణ (Telangana) రవాణా శాఖ (Transport Department) పక్షాన జనవరి 1 నుండి 31వ తేదీ వరకు రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులతో రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం తీసుకోవాల‌ని సూచించారు. రోడ్డు భ‌ద్ర‌తా క్ల‌బ్‌లో ప్ర‌తి పాఠ‌శాల చేరాల‌ని సూచించారు. రవాణా శాఖ అందించే సూచనలు పాటించాల‌ని, హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనం నడపకూడ‌ద‌ని, రాంగ్ రూట్లో ప్ర‌యాణం చేయ‌కూడ‌ద‌ని, అతివేగంతో వాహ‌నం న‌డ‌ప‌కూడ‌ద‌ని ప‌లు సూచ‌న‌లు చేశారు. రోడ్డు ప్రమాదాల వల్లే మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయని గుర్తు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement