త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి మంత్రి ఉత్తమ్ కీలక సూచనలు చేశారు. రైతులు ఆందోళన చెందకుండా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు.

J

Telangana | Published On Jul 9, 2026, 6.43 pm IST

El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!

సంక్షిప్త సారాంశం

ఎల్‌నినో (El Nino) ప్రభావం వల్ల నీటి కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం రైతులకు సూచించింది. ఐఎండీ (IMD) వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ అధికారుల సలహాల మేరకే రైతులు సాగు నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా నీటి లభ్యత ఆధారంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తామని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

Advertisement
  • తెలంగాణ రైతాంగానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనలు

El Nino Impact Telangana | హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం జులై 9న జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతాంగానికి భరోసా ఇస్తూనే పలు కీలక సూచనలు చేశారు. ఎల్‌నినో (El Nino) ప్రభావం వల్ల తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులు సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల (Alternative crops) వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఐఎండీ వార్నింగ్స్ ఫాలో అవ్వాలి

సాగు విషయంలో రైతులు అనవసరమైన వదంతులు నమ్మొద్దని, వాతావరణ శాఖ (IMD) ఎప్పటికప్పుడు విడుదల చేసే వర్షపాతం అంచనాలు, హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. కేవలం వ్యవసాయ అధికారులు, సైంటిస్టులు ఇచ్చే గైడ్‌లైన్స్ ఆధారంగానే ఈ సీజన్‌లో ఏ పంట వేయాలనే నిర్ణయం తీసుకోవాలన్నారు.

జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్

ప్రతి జిల్లాలో వర్షపాతం, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ (Ground water levels), రిజర్వాయర్లలో (Reservoirs) ఉన్న నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పక్కా సాగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా, తక్కువ నీటితో చేతికొచ్చే పంటలను ప్రోత్సహించాలన్నారు. ఈ విషయాలపై గ్రామసభలు, రైతు వేదికల ద్వారా క్షేత్రస్థాయిలో అవేర్‌నెస్ (Awareness) కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.

విత్తనాలు, ఎరువులు రెడీ.. టెన్షన్ వద్దు

సాగుకు అవసరమైన విత్తనాలు, ఫర్టిలైజర్స్ (Fertilizers) కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రారంభమైన వెంటనే శ్రీపాద ఎల్లంపల్లితో పాటు గోదావరి బేసిన్‌లోని ప్రధాన జలాశయాలను నింపేందుకు ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖలు పూర్తి కో-ఆర్డినేషన్‌తో (Coordination) పనిచేస్తూ రైతులకు అండగా నిలవాలని ఆయన ఆదేశించారు.

ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్ తదితరులు నేరుగా పాల్గొనగా.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా హాజరయ్యారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎల్‌నినో పరిస్థితులపై దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement