త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET PG | నీట్ పీజీ ప‌రీక్ష‌.. మ‌ద్యం తాగి వ‌చ్చిన విద్యార్థి.. అనుమ‌తించ‌ని సిబ్బంది

NEET PG | దేశ‌వ్యాప్తంగా నీట్ పీజీ (NEET PG) ప‌రీక్ష కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలో 17,627 మంది ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరికోసం 56 ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

G

Telangana | Published On Aug 30, 2026, 10.26 am IST

NEET PG | నీట్ పీజీ ప‌రీక్ష‌.. మ‌ద్యం తాగి వ‌చ్చిన విద్యార్థి.. అనుమ‌తించ‌ని సిబ్బంది
Advertisement

NEET PG | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా నీట్ పీజీ (NEET PG) ప‌రీక్ష కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలో 17,627 మంది ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరికోసం 56 ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో జ‌రుగుతున్న ఈ పరీక్ష ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ముగియ‌నుంది. కాగా, రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న అతడిని గుర్తించిన‌ సిబ్బంది ఎగ్జామ్ హాల్‌లోకి అనుమ‌తించ‌లేదు. దేశవ్యాప్తంగా 1300 కేంద్రాల్లో ఈ పీజీ పరీక్ష జరుగుతున్న‌ది. సెప్టెంబ‌ర్ 30న ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తారు.

మారిన ఎగ్జామ్ ప్యాటర్న్

ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష విధానంలో ఎన్‌బీఈఎంఎస్ (NBEMS) కీలక మార్పులు ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న 200 ప్రశ్నల స్థానంలో ఈసారి మొత్తం ప్రశ్నల సంఖ్యను 180కి తగ్గించారు. మొత్తం పరీక్షను 720 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇవ్వనుండగా, తప్పు సమాధానానికి 1 మార్కు కోత (నెగెటివ్ మార్కింగ్) విధిస్తారు. ప్రశ్న‌పత్రాన్ని మొత్తం ఐదు సెక్షన్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్‌లో 36 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌కు గరిష్టంగా 42 నిమిషాల సమయాన్ని నిర్దేశించారు. కేటాయించిన 42 నిమిషాల సమయం ముగియగానే స్క్రీన్‌పై ఆ సెక్షన్ ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది. అభ్యర్థులు ఒకసారి పూర్తి చేసిన సెక్షన్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉండదు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement