త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DGP Shivdhar Reddy | తెలంగాణలో మావోయిస్టులు లేరు : డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి

DGP Shivdhar Reddy | తెలంగాణ‌లో మావోయిస్టుల లొంగుబాటు కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో 42 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఎదుట శుక్ర‌వారం లొంగిపోయారు. భారీగా ఆయుధాల‌ను అప్ప‌గించారు.

S

Telangana | Published On Apr 10, 2026, 4.29 pm IST

DGP Shivdhar Reddy | తెలంగాణలో మావోయిస్టులు లేరు : డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి
Advertisement

ఇప్ప‌టి వ‌ర‌కు 205 మంది మావోలు లొంగుబాటు
ఇక మిగిలింది ఐదుగురే
వారు కూడా లొంగిపోవాల‌ని కోరుతున్నాం

DGP Shivdhar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో మావోయిస్టుల లొంగుబాటు కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో 42 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఎదుట శుక్ర‌వారం లొంగిపోయారు. భారీగా ఆయుధాల‌ను అప్ప‌గించారు. ఈ నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలంగాణ‌లో మావోయిస్టులు లేర‌ని డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇక మిగిలింది ఐదుగురు మావోయిస్టులే అని ఆయ‌న తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న ఆ ఐదుగురిని కూడా జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోవాల‌ని కోరుతున్నామ‌ని డీజీపీ పేర్కొన్నారు.

శుక్ర‌వారం లొంగిపోయిన 42 మంది మావోయిస్టుల్లో టాప్ క‌మాండ‌ర్లు ఉన్నారు. పీఎల్‌జీఏ బెటాలియ‌న్ క‌మాండ‌ర్, డీకేఎస్‌జ‌డ్‌సీ మెంబ‌ర్ సోది మ‌ల్లా అలియాస్ కేశ‌ల్ అలియాస్ నిఖిల్, స్టేట్ క‌మిటీ మెంబ‌ర్, జేఎంఎండ‌బ్ల్యూపీ డీవీసీ సెక్ర‌ట‌రీ చాప నారాయ‌ణ అలియాస్ గ‌జేంద‌ర్ అలియాస్ మ‌ధు, బీకే ఏఎస్ఆర్ డివిజ‌న్ డీవీసీ మెంబ‌ర్ క‌డ్తి స‌న్ను అలియాస్ మంగ్తు ఉన్నారు. 2026 జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో మొత్తం 205 మంది మావోయిస్టులు లొంగిపోయార‌ని డీజీపీ తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టులు 36 ఆయుధాల‌ను అప్ప‌గించారు. ఇందులో ఏకే 47 రైఫిల్స్, ఎస్ఎల్ఆర్‌లు, ఇన్సాస్ రైఫిల్స్, .303 రైఫిల్స్, 9ఎంఎం స్టెన్ గ‌న్, పిస్తోల్స్, రివాల్వ‌ర్లతో పాటు ఇత‌ర ఆయుధాలు, 1007 రౌండ్ల బుల్లెట్ల‌ను అప్ప‌గించారు. 800 గ్రాముల బంగారం కూడా అప్ప‌గించిన‌ట్లు డీజీపీ తెలిపారు.

పీఎల్‌జీఏకు చెందిన తెలంగాణ స్టేట్ క‌మిటీ స‌భ్యులంద‌రూ లొంగిపోవ‌డంతో రాష్ట్రంలో మావోయిస్టు నెట్ వ‌ర్క్ పూర్తిగా మాయ‌మైంద‌ని డీజీపీ పేర్కొన్నారు. ఇక గ‌ణ‌ప‌తి, ప‌సునూరి న‌ర‌హ‌రి, జోడే ర‌త్న‌భాయి, వార్త శేఖ‌ర్ అలియాస్ మంక్తు, రంగ‌బోయిన రూపీ అలియాస్ భాగ్య ఉన్నారు. ఈ ఐదుగురు కూడా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేర‌కు లొంగిపోవాలి. ఎవ‌రైతే బ‌య‌ట‌కు రాకుండా ఉన్నారో వారు అజ్ఞాతం వీడి రావాల‌ని ఆహ్వానిస్తున్నామ‌ని డీజీపీ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement