త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pending Bills | మన ఊరు మన బడి బిల్లులు చెల్లించలేదని.. ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్

Pending Bills | ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో (Pending Bills) ప్ర‌భుత్వ పాఠ‌శాల భ‌వ‌నానికి కాంట్రాక్ట‌ర్ తాళం వేశాడు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కోడేరు మండ‌ల కేంద్రంలో ‘మనఊరు- మనబడి’ కార్య‌క్ర‌మంలో భాగంగా సురేశ్ అనే కాంట్రాక్ట‌ర్ పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మించారు.

G

Telangana | Published On Jan 19, 2026, 11.34 am IST

Pending Bills | మన ఊరు మన బడి బిల్లులు చెల్లించలేదని.. ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డంతో (Pending Bills) ప్ర‌భుత్వ పాఠ‌శాల భ‌వ‌నానికి కాంట్రాక్ట‌ర్ తాళం వేశాడు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కోడేరు మండ‌ల కేంద్రంలో ‘మనఊరు- మనబడి’ కార్య‌క్ర‌మంలో భాగంగా సురేశ్ అనే కాంట్రాక్ట‌ర్ పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మించారు. రెండేండ్లు గ‌డుస్తున్నా ప్ర‌భుత్వం బిల్లులు విడుద‌ల చేయ‌డం లేద‌న్నారు. అప్పుగా తెచ్చిన ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌లేక ఇబ్బంది ప‌డుతున్నామ‌ని, ప్ర‌భుత్వం కాంట్రాక్ట‌ర్ల‌ను వేధిస్తున్న‌దని చెప్పారు. ఇప్ప‌టికైన స‌ర్కార్ త‌మ బిల్లులు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

కాగా, శ‌నివారం కూడా పెండింగ్ బిల్లుల కోసం మ‌హ‌బూబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్‌ ధారాసింగ్‌ తాళం వేశారు. 2022లో చిన్నగూడూరు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ‘మనఊరు -మనబడి’ కింద ఎంపిక‌య్యాయ‌ని, రూ.4.50 లక్షలతో అభివృద్ధి పనులు పనులు చేశామ‌ని ధారాసింగ్ చెప్పారు. ప‌నులు పూర్తిచేసి మూడేండ్లు కావస్తున్నా నేటికీ బిల్లులు రాకపోవడంతో తాళం వేశామన్నారు. అధికారులు తక్షణమే స్పందించి బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

[video width="848" height="480" mp4="https://axdxht1orlhu.compat.objectstorage.ap-hyderabad-1.oraclecloud.com/static.trinethra/wp-content/uploads/2026/01/WhatsApp-Video-2026-01-19-at-11.00.20-AM-1.mp4"][/video]

వ‌రంగ‌ల్ జిల్లా చెన్నారావుపేట మండ‌లంలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. మనఊరు- మనబడి బిల్లులులు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ లింగాపురం ప్రభుత్వ పాఠశాలకు ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్‌ నామిడ్ల సురేశ్‌ తాళంవేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు ఇంతవరకు చెల్లించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించాల‌ని, లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement