త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్ల‌కే చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిధ్యం క‌ల్పించాలి.. ఎంపీ చామ‌ల డిమాండ్

MP Chamala Kirankumar Reddy | సింగపూర్, బ్రిటన్ లాంటి దేశాల్లో “జెన్ జీ” కి చట్టసభల్లో ప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

S

Telangana | Published On Jul 27, 2026, 3.11 pm IST

MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్ల‌కే చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిధ్యం క‌ల్పించాలి.. ఎంపీ చామ‌ల డిమాండ్
Advertisement

MP Chamala Kirankumar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : సింగపూర్, బ్రిటన్ లాంటి దేశాల్లో “జెన్ జీ” కి చట్టసభల్లో ప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి తెలిపారు. భార‌త్‌లో కూడా 21 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపు ఉన్న యువతకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పిస్తే, వారి సమస్యలపై పూర్తి అవగాహనతో చర్చించి, సమస్యల పరిష్కారం చేయొచ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఎంపీ చామ‌ల సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

21 ఏళ్ల‌కే చ‌ట్ట‌స‌భ‌ల్లోకి యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పించే ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలని, “ఇండియా” కూటమి నేతలకు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి వివరించనున్నారని తెలిపారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, తీర్మానం చేసే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు.

విద్యార్థులపై జరిగిన అమానుష దాడికి కేంద్ర హోంమంత్రి క్షమాపణలు చెప్పాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అంతా అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ఉపేక్షించేది లేద‌న్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలంటే ప్రభుత్వం భాధ్యతతో వ్యవహరించాలని ఎంపీ చామ‌ల సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement