త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Chamala Kiran Kumar Reddy | కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగం వ‌ల్లే బండి సంజ‌య్‌కి ప‌ద‌వి : ఎంపీ చామ‌ల‌

MP Chamala Kiran Kumar Reddy | రాహుల్ గాంధీ ప్రధాని అవడం అంటే దేశానికి గ్రహణం పట్టినట్లు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.

S

Telangana | Published On Mar 4, 2026, 4.24 pm IST

MP Chamala Kiran Kumar Reddy | కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగం వ‌ల్లే బండి సంజ‌య్‌కి ప‌ద‌వి : ఎంపీ చామ‌ల‌
Advertisement

MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాహుల్ గాంధీ ప్రధాని అవడం అంటే దేశానికి గ్రహణం పట్టినట్లు అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. గాంధీ భ‌వ‌న్‌లో ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

గతంలో గుజరాత్‌లో నరేంద్ర మోదీ పారచూట్ నాయకుడిగా వచ్చి సీఎం అయ్యారు. అమిత్ షా, మోదీ ఇద్దరు బిల్లా రంగాలు.. దేశాన్ని భ్ర‌ష్టు పట్టించారు. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా చేసి పరిపాలిస్తున్నారు. ఎన్నికల్లో మీకు పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి. నితీష్, చంద్రబాబు లాంటి వారి వల్ల మీ ప్రభుత్వం కొనసాగుతుంది. 2009లో రాహుల్ ప్రధాని కావాలని మన్మోహన్ లాంటివారు కోరారు. మోదీలాగా ఎన్నికల్లో గెలవకున్నా.. సీఎం అయినట్లు... రాహుల్‌కు అవకాశం వచ్చినా పీఎం కాలేదు అని ఎంపీ చామ‌ల పేర్కొన్నారు.

బ్రిటీష్ పాలన తర్వాత దేశంలో కాంగ్రెస్ ఎన్నో సంస్కరణలు తెచ్చింది. కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగం వల్లే ఈరోజు సామాన్యులకు పదవులు. బండి సంజయ్‌కి కూడా పదవి రావడానికి రాజ్యాంగమే కారణం. మీరు కొంతమంది కోసమే పనిచేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు ఎలా దోచుకున్నారో కిషన్ రెడ్డికి తెలియ‌నిది కాదు. రాష్ట్రాన్ని పదేళ్లు లూటీ జరగకుండా ఎందుకు ఆపలేదు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు ఒక్కసారి కూడా మీరు పట్టించుకోలేదు ? గుజరాత్ లో సబర్మతి నదిని అభివృద్ధి చేసినప్పుడు మేయర్‌గా కాంగ్రెస్ ఉన్నా.. మంచి పనికి మేము మద్దతు ఇచ్చాం. మేము మూసీని డెవలప్ చేస్తమంటె ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి నిల‌దీశారు.

Advertisement
Advertisement