త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mandula Samuel | అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ను మంత్రిని చేసింది నేనే.. ఎమ్మెల్యే మందుల సామేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Mandula Samuel | ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ను మంత్రిని చేసింది నేనే అని తుంగ‌తుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Mar 12, 2026, 7.07 pm IST

Mandula Samuel | అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ను మంత్రిని చేసింది నేనే.. ఎమ్మెల్యే మందుల సామేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Mandula Samuel | త్రినేత్ర‌.న్యూస్ : ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ను మంత్రిని చేసింది నేనే అని తుంగ‌తుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి రావడ‌మంటే అది నా ఘ‌న‌త‌నే అని సామేల్ అన్నారు. టీపీసీసీ ఎస్సీ విభాగ చైర్ పర్సన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి మందుల సామేల్ హాజ‌రై ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మాదిగ ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకపోయి సోనియా గాంధీని ఒప్పించి అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇప్పించాను. మాదిగ ఎమ్మెల్యేలను ఏక తాటిపై తీసుకొచ్చిన ఘనత దేశంలో నాదే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తే టీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇవ్వలేదు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి 50 వేల మెజారిటీతో గెలిచిన చరిత్ర నాది. దళితులకు, ఆదివాసులకు ప్రమాదం పొంచి ఉంది. ద‌ళితులు కూలిపోతున్నారు. ఆదివాసులు అంతరించి పోతున్నారు. ఎవడేవడో వేల కోట్లు దోచుకు పోతున్నారని ఎమ్మెల్యే మందుల సామేల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement