త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | ఎమ్మెల్యేలు డ్ర‌గ్ టెస్టులు చేయించుకున్నాకే.. అసెంబ్లీకి రావాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

MLA Anirudh Reddy | జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఇటీవ‌లే నాటుసారాను తిరిగి తీసుకురావాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. తాజాగా డ్ర‌గ్స్ అంశంపై ఆయ‌న అసెంబ్లీలో చిట్ చాట్ చేశారు.

S

Telangana | Published On Mar 16, 2026, 1.52 pm IST

MLA Anirudh Reddy | ఎమ్మెల్యేలు డ్ర‌గ్ టెస్టులు చేయించుకున్నాకే.. అసెంబ్లీకి రావాలి : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Advertisement

MLA Anirudh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఇటీవ‌లే నాటుసారాను తిరిగి తీసుకురావాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. తాజాగా డ్ర‌గ్స్ అంశంపై ఆయ‌న అసెంబ్లీలో చిట్ చాట్ చేశారు. డ్ర‌గ్ టెస్టులు చేయించుకున్న త‌ర్వాత‌నే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల‌ని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ప్రజా ప్రతినిధులతో పాటు సినీ ఆర్టిస్టలు 90 రోజుల‌కు ఒక‌సారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకున్న తర్వాత నే సినిమాలు రిలీజ్ కావాలి. టెస్ట్ చేయించుకోక పోతే సినిమాలు రిలీజ్ కావు. పొలిటీషన్స్ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. ప్ర‌జాప్ర‌తినిధులు డ‌గ్ర్ టెస్టులు చేయించుకోక‌పోతే ప‌లు అనుమానాలు వ‌స్తాయి. డ్ర‌గ్ టెస్టు చేయించుకోక‌పోతే.. ప్ర‌జాప్ర‌తినిధులు అసెంబ్లీకి రావొద్దు అని అనిరుధ్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement