త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adi Srinivas | కాళేశ్వ‌రం ద్వారా చుక్క నీరు తీసుకోలేదు : ఆది శ్రీనివాస్

Adi Srinivas | కాళేశ్వ‌రం ద్వారా చుక్క నీరు తీసుకోకుండానే రికార్డు స్థాయిలో వ‌రి ధాన్యం పండించామ‌ని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా యాసంగి పంట‌కు సంబంధించి రైతుల‌కు 22న రైతు భ‌రోసా జ‌మ చేయ‌బోతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. దీంతో బీఆర్ఎస్ స‌భ్యులు క‌ల‌గ‌జేసుకుని.. రైతుబంధు ఇప్పుడు కూడా ఇస్తరో, ఇవ్వ‌రో అని ఎద్దెవా చేశారు.

S

Telangana | Published On Mar 17, 2026, 11.41 am IST

Adi Srinivas | కాళేశ్వ‌రం ద్వారా చుక్క నీరు తీసుకోలేదు : ఆది శ్రీనివాస్
Advertisement

Adi Srinivas | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వ‌రం ద్వారా చుక్క నీరు తీసుకోకుండానే రికార్డు స్థాయిలో వ‌రి ధాన్యం పండించామ‌ని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతేకాకుండా యాసంగి పంట‌కు సంబంధించి రైతుల‌కు 22న రైతు భ‌రోసా జ‌మ చేయ‌బోతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. దీంతో బీఆర్ఎస్ స‌భ్యులు క‌ల‌గ‌జేసుకుని.. రైతుబంధు ఇప్పుడు కూడా ఇస్తరో, ఇవ్వ‌రో అని ఎద్దెవా చేశారు.

ఈ క్ర‌మంలో ఆది శ్రీనివాస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. మీ హ‌యాంలో వ‌రి వేసుకుంటే ఉరి అన్న‌రు. మేం అలా కాదు.. వ‌డ్లు పండించే రైతుల‌కు రూ. 500 బోన‌స్ ఇచ్చాం. రైతుల‌కు కానీ, కౌలు రైతుల‌కు కానీ మీ హ‌యాంలో రైతుబంధు ఒక్క‌టే ఇచ్చారు. ఇదే జిందా తిలిస్మాత్ అనుకోమ‌ని చెప్పారు. కానీ మేం రైతుభ‌రోసా, ప‌నిముట్లు ఇస్తున్నాం, 500 బోన‌స్ ఇస్తున్నాం. రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేసే ప్ర‌భుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్ర‌మే. దీన్ని రైతులు గ‌మ‌నిస్తున్నారు. రైతుల మ‌ద్ద‌తు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబ‌ట్టే పంచాయ‌తీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గెలిచామ‌ని ఆది శ్రీనివాస్ తెలిపారు.

అబ‌ద్దాలు ఆడి రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించాల‌నుకుంటే ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని విశ్వ‌సించ‌రు. కాళేశ్వ‌రం నుంచి చుక్క నీరు తీసుకోలేదు. అయినా కూడా మా ప్ర‌భుత్వం 71 ల‌క్ష‌ల 86 వేల మెట్రిక్ ట్న‌నుల వ‌రి ధాన్యం పండించాం. ఇందులో 39 ల‌క్ష‌ల 8 వేల మెట్రిక్ ట‌న్నులు స‌న్న‌ర‌కం. కాళేశ్వ‌రం ద్వారా చుక్క నీరు లేకున్నా ఎల్ల‌ప‌ల్లిం ద్వారా నీరు తీసుకుని వరి ధాన్యం పండించాం. ఇది దేశంలోనే రికార్డు అని ఆయ‌న పేర్కొన్నారు.

మీరు క‌ట్టిన కాళేశ్వ‌రం ఒక్క‌టి కూడా కూలిపోయింది. కాంగ్రెస్ హ‌యాంలో నిర్మించిన నాగార్జున సాగ‌ర్, శ్రీశైలం, ఎంఎండీ, శ్రీరాంసాగ‌ర్, జూరాల ఇవ‌న్నీ సేవ‌లందిస్తున్నాయి. నాణ్య‌త లేని క‌ట్ట‌డం క‌ట్టారు. ధ‌ర‌ణి ద్వారా రైతుల‌కు అన్యాయం జ‌రిగింది. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి భూ భార‌తి తీసుకొచ్చాం. పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు య‌త్నిస్తున్నాం. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఉలికిప‌డ‌డం స‌రికాదు. నిజాలు మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ప‌దేండ్ల‌లో రేష‌న్ కార్డులు ఇవ్వ‌లేదు. 15 ల‌క్ష‌ల 12 వేల మంది కొత్త రేష‌న్ కార్డులు అందించాం. ఇది ఈ ప్ర‌భుత్వం యొక్క ప‌నితీరు. తెల్ల‌రేష‌న్ కార్డు ల‌బ్దిదారుల‌కు ఆరు కిలోల చొప్పున స‌న్నబియ్యం ఇస్తున్నాం. 3 కోట్ల 38 ల‌క్ష‌ల మందికి ఆహార భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నాం అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement