త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | ప్రజల తీర్పును కాలరాసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్: మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, క‌డియం శ్రీహ‌రికి క్లీన్‌చిట్ ఇస్తూ స్పీకర్ వెలువ‌రించిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాద‌ని, కాంగ్రెస్ రాజ్యాంగమంటూ మండిప‌డ్డారు.

G

Telangana | Published On Mar 11, 2026, 12.24 pm IST

Niranjan Reddy | ప్రజల తీర్పును కాలరాసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్: మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి
Advertisement

Niranjan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, క‌డియం శ్రీహ‌రికి క్లీన్‌చిట్ ఇస్తూ స్పీకర్ వెలువ‌రించిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి (Niranjan Reddy) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాద‌ని, కాంగ్రెస్ రాజ్యాంగమంటూ మండిప‌డ్డారు. స్పీక‌ర్ తీర్పు కాంగ్రెస్ ద్వంద నీతికి నిదర్శనమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రజల తీర్పును కాలరాసి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింద‌న్నారు.

కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్‌కు, కూతురును కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించి కండువా వేసుకుని తిరిగి చేతి గుర్తుకు ఓటేయమని కోరిన కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇవ్వడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. నిత్యం రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలును గాలికి వదిలేయడమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా గాలికి వదిలేశాడని విమ‌ర్శించారు.

తెలంగాణ నిధుల దోపిడీకి ఇక్కడి అధికారాన్ని అడ్డు పెట్టుకున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారింద‌ని, అందుకే ఇక్కడి పరిణామాలపై, ఇక్కడి ప్రభుత్వ అరాచకాలపై కాంగ్రెస్ అధిష్ఠానం నోరెత్తడం లేద‌ని మండిప‌డ్డారు. దానం, కడియం శ్రీహరిల అనర్హత విషయంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.

Advertisement
Advertisement