త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | అబ‌ద్ధాల సంఘాల‌కు కోట్ల రూపాయాలు ఖ‌ర్చు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | రాష్ట్రంలో అబ‌ద్ధాలు ప్ర‌చారం చేసేందుకు కొంద‌రు ప‌నిక‌ట్టుకుని కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేస్తున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ అబ‌ద్ధాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్దు.. న‌న్ను న‌మ్మండి అని సీఎం అన్నారు.

S

Telangana | Published On Aug 13, 2026, 8.06 pm IST

CM Revanth Reddy | అబ‌ద్ధాల సంఘాల‌కు కోట్ల రూపాయాలు ఖ‌ర్చు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో అబ‌ద్ధాలు ప్ర‌చారం చేసేందుకు కొంద‌రు ప‌నిక‌ట్టుకుని కోట్ల రూపాయాలు ఖ‌ర్చు చేస్తున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ అబ‌ద్ధాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్దు.. న‌న్ను న‌మ్మండి అని సీఎం అన్నారు. కూక‌ట్‌ప‌ల్లిలో ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం సీఎం ప్ర‌సంగిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మీరు కొనుకున్న భూమి ఏదైనా కార‌ణం చేత‌ 22ఏ జాబితాలో ప‌డి ఉంటే ఒక్క ఇంచు కూడా ఎక్క‌డికి పోదు.. మీకు భ‌రోసా ఇస్తున్నా. రిజిస్ట్రేష‌న్లు చేసుకునేలా ఆదేశాలు ఇస్తా. ఎవ‌రు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.. కొంద‌రు కోట్ల రూపాయాలు ఖ‌ర్చు పెట్టి సోష‌ల్ మీడియాలో పెడుతున్న‌రు. నిజం పెడితే మంచిది.. న‌మ్ముత‌డు. అబ‌ద్దాలు పెడితే హౌలాగాడు అనుకుంట‌రు. ఈ అబద్దాల సంఘాల‌కు అసోసియేష‌న్లు ఏర్పాటు చేసి కోట్లు ఖ‌ర్చు పెట్టి అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్న‌రు. ఆయ‌న ఇచ్చింది ఏమ‌న్న ఆపిన్న‌. ఏమ‌న్న గుంజుకున్నాన‌.. ఆయ‌న ఏద‌న్న సంపాదించి ఆడ పెడితే తాక‌ట్టు పెట్టిన్న‌ ఆలోచించండి.. అన్ని మోసుకుంటేనే.. అప్పుల‌కు అస‌లు మిత్తీ క‌లిపి నా త‌ల తాక‌ట్టు పెట్టి ప్ర‌తి నెల 7 వేల కోట్లు క‌డుతూ.. రూపాయి రూపాయి కూడ‌బెట్టి మంచి ప‌నులు చేస్తున్నా.. విధ్వంస‌మైన తెలంగాణ‌ను వికాసం వైపు న‌డ‌ప‌డానికి దేవుడు నాకు శ‌క్తి ఇచ్చిండు అని సీఎం పేర్కొన్నారు.

Advertisement
Advertisement