త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPI Centenary Closing Ceremony | సీపీఐ శతవసంతాల ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి: ఖమ్మం పర్యటనకు గ్రీన్ సిగ్నల్

ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతవంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు సీపీఐ నేతలు. ఈ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించారు.

J

Telangana | Published On Jan 12, 2026, 9.14 pm IST

CPI Centenary Closing Ceremony | సీపీఐ శతవసంతాల ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి: ఖమ్మం పర్యటనకు గ్రీన్ సిగ్నల్

సంక్షిప్త సారాంశం

జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే సీపీఐ 100 ఏళ్ల ఉత్సవాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఈ మేరకు సీఎంను కలిసి ఆహ్వానం పలికారు.

Advertisement

CPI Centenary Closing Ceremony | త్రినేత్ర.న్యూస్: ఖమ్మం నగరంలో జనవరి 18న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న సీపీఐ (CPI) శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు (MLC) నెల్లికంటి సత్యం ముఖ్యమంత్రిని కలిసి అధికారికంగా ఆహ్వానం అందించారు.

సీఎం సానుకూల స్పందన

సీపీఐ నాయకత్వం అందించిన ఆహ్వానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. పార్టీ శతవసంతాల ముగింపు ఉత్సవాలకు హాజరయ్యేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని పల్లా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐకి ఉన్న బలమైన పునాదులు, ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా సీఎం ఈ సభకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

సీపీఐ ఆవిర్భవించి వంద ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో నిర్వహించే ముగింపు సభను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రాక ఖరారు కావడంతో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement