CM Revanth Reddy | మహిళా బిల్లు వీగిపోవడం.. బీజేపీ ఓటమినే : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం అంటే.. రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం అంటే.. రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చింది. మహిళా బిల్లు వీగిపోవడం.. బీజేపీ విధానాల ఓటమిగా భావించాలి. మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. మహిళా బిల్లుపై ప్రధాని మోదీకి నిజాయితీ లేదు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే పార్లమెంట్లో అందరూ మద్దతు తెలిపేవారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి దక్షిణాదికి అన్యాయం చేసేవారు. ప్రధాని మోదీ.. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య అంతరాలు పెట్టే విధానాన్ని విరమించుకోవాలి.
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాకు చిత్తశుద్ధి ఉంది. కేంద్రానికి ఆర్థిన వనరులు దక్షిణాది నుంచి అందుతున్నాయి. యూపీ ఎన్నికలలోపు మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలి. 2023 మహిళా రిజర్వేషన్ల బిల్లును యథావిధిగా అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్లలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి. ఈ బిల్లు విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు.
నిన్న లోక్సభలో బిల్లు వీగిపోవడంతో ప్రధాని మోదీ అహంకారం తగ్గింది. తప్పుడు చట్టాలు తీసుకువస్తే గల్లీ నుంచి పార్లమెంట్్ వరకు నిరసన తెలుపుతాం. 2023 మహిళా బిల్లును పోమవారం పార్లమెంట్లో పెట్టాలి. 2023 మహిళా బిల్లును పెడితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
బిల్లు వీగిపోవడం అంటే బీజేపీ ఓడిపోవడమే. బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూసింది. ప్రధాని మోదీ కుట్రలను కాంగ్రెస్ సమర్థవంతంగా అడ్డుకుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలను కాంగ్రెస్ ఎండగట్టింది. ఇది రాజకీయ విధానాల ఓటమి కాదు.. బీజేపీ విధానాల ఓటమి. రాజ్యాంగం మార్చడానికి, రిజర్వేషన్లు రద్దు చేసేందుకు అబ్ కీబార్ చార్ సౌ అన్నారు బీజేపీకి 400 సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే రేపే మద్దతు ఇస్తాం. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ కోటా పెట్టాలి. హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



