త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఈ విజ‌యం మా బాధ్య‌త‌ను మ‌రింత పెంచింది : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సాధించిన భారీ విజ‌యం.. మా బాధ్య‌త‌ను మ‌రింత పెంచింద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పున‌రంకిత‌మ‌వుతామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Feb 13, 2026, 6.49 pm IST

CM Revanth Reddy | ఈ విజ‌యం మా బాధ్య‌త‌ను మ‌రింత పెంచింది : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సాధించిన భారీ విజ‌యం.. మా బాధ్య‌త‌ను మ‌రింత పెంచింద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పున‌రంకిత‌మ‌వుతామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమ‌ని సీఎం పేర్కొన్నారు.

అదేవిధంగా.. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద - మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ… భ‌విష్య‌త్‌లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామ‌ని సీఎం రేవంత్ అన్నారు.

Advertisement
Advertisement