త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

కేప్ టౌన్ కు ఆ ఇద్దరు? అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులేనా?

ఈ నెల 13 నుంచి 19 వరకు 6 రోజుల పాటు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగే కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్సులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కానున్నట్టు సమాచారం

a

News | Published On Sep 5, 2026, 8.09 pm IST

కేప్ టౌన్ కు ఆ ఇద్దరు? అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులేనా?
Advertisement

త్రినేత్ర.న్యూస్ : శాసన సభ సమావేశాలు కేవలం రెండు రోజుల పాటే జరగనున్నాయా? లేదా 3 రోజుల పాటు జరుగుతాయా? దీనిపై అసెంబ్లీ లాబీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. "అసెంబ్లీ రెండు రోజులే పెడుతున్న‌రు. ఎక్కువ రోజులు పెడితే మీదంతా బ‌ట్ట‌బ‌య‌లైత‌ది కాబ‌ట్టి. మా ఎమ్మెల్యేలు మిమ్మ‌ల్ని ప్ర‌శ్నిస్త‌ర‌ని భ‌య‌ప‌డి రెండు రోజులే పెడుతున్న‌రు" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ రోజు దీక్షా సభలో బహిరంగంగా వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో.. సభ ఎన్ని రోజులు అనే విషయం చర్చ జరుగుతున్నది..కాగా.. ఈ నెల 13 నుంచి 19 వరకు 6 రోజుల పాటు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగే కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్సులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాలు 9 లేదా 10 వ తేదీన ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

 

ట్యాగ్స్:

Advertisement
Advertisement