Revanth Reddy | ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించేందుకు కుట్ర.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్
Revanth Reddy | ఎస్ఐఆర్ (SIR) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారని, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారని చెప్పారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ఎస్ఐఆర్ (SIR) పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారని, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారని చెప్పారు. తెలంగాణలోనూ (Telangana) అదేవిధంగా గెలవాలని బీజేపీ (BJP) ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో దొంగదెబ్బ తీస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు లేరని స్పష్టం చేశారు. ఓట్లు తొలగించి దొంగ దెబ్బ తీయాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. కొడంగల్లోని తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓట్లను బీజేపీ టార్గెట్ చేసిందని వెల్లడించారు. ఇంతకుముందు ఎన్నికల్లో ఓడించేందుకు ఈడీ, సీబీఐ ఉపయోగించేవారని, కానీ ఇప్పుడు ఓట్ల తొలగింపుతో తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. చిన్న తప్పిదాలను సాకుగా చూపి పేదల ఓట్లను తొలగించేంందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెన్ను (Congress) ఓడించేందుకు ఈ కుట్రకు బీఆరెస్ కూడా బీజేపీకి (BRS) మద్దతు ఇస్తున్నదని చెప్పారు. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వెల్లడించారు. ప్రజల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉందని తెలిపారు.
గ్రామాల వారీగా బీఎల్ఏలను సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగించకుండా చూడాలని సూచించారు. ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత మండల నాయకులదేనని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు 4 గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతీ బూత్లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత తీసుకోవాలని చెప్పారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. బీజేపీ, బీఆరెస్ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్కు (Kodangal) ఈ గుర్తింపు, గౌరవం వచ్చిందని చెప్పారు.
సంబంధిత వార్తలు

Polytechnic Students Protest | కంటోన్మెంట్లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా.. ఫోన్లో మద్దతు తెలిపిన కేటీఆర్
సెప్టెంబర్ 5, 2026

Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మహాధర్నాకు తరలి రండి
సెప్టెంబర్ 5, 2026

Revanth Reddy | రెండేండ్లు సమయమివ్వండి.. టీచర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●SIP | రూ.10వేల సిప్తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..
- ●PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!
- ●Polytechnic Students Protest | కంటోన్మెంట్లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా.. ఫోన్లో మద్దతు తెలిపిన కేటీఆర్
- ●Chemical dumping Nagarjuna Sagar | నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్లో డేంజర్ బెల్స్: కెమికల్స్ పారబోసిందెవరు?
- ●PM Modi | పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి బయటపడేయాలి.. ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ సూచన
- ●CM Revanth Reddy Teachers Day | వచ్చే ఎన్నికల్లో నాకు ఎన్ని మార్కులు వేయాలో మీరే డిసైడ్ చేయండి

SIP | రూ.10వేల సిప్తో రూ.7 కోట్లు.. ఆదిత్య బిర్లా స్కీమ్ అద్భుతం..

PM Modi | మంచి వక్త కావాలంటే ఏం చేయాలి..? మోదీ ప్రశ్నకు టీచర్ సమాధానం.. నవ్వేసిన ప్రధాని..!

Polytechnic Students Protest | కంటోన్మెంట్లో పాలిటెక్నిక్ విద్యార్థినుల ధర్నా.. ఫోన్లో మద్దతు తెలిపిన కేటీఆర్

Chemical dumping Nagarjuna Sagar | నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్లో డేంజర్ బెల్స్: కెమికల్స్ పారబోసిందెవరు?



