త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పంట‌ల మార్పిడి ప్రాధాన్యాన్ని రైతుల‌కు వివ‌రించండి.. అధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశం

CM Revanth Reddy | రాష్ట్రంలో వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాల‌యంలో స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది.

S

Telangana | Published On Jun 1, 2026, 12.11 pm IST

CM Revanth Reddy | పంట‌ల మార్పిడి ప్రాధాన్యాన్ని రైతుల‌కు వివ‌రించండి.. అధికారుల‌కు సీఎం రేవంత్ ఆదేశం
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాల‌యంలో స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మీక్ష స‌మావేశానికి వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు హాజ‌ర‌య్యారు.

నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం.. ఎల్‌నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ ప‌లు సూచ‌న‌లు చేశారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలి. తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు వివరించాలి. పంట మార్పిడి.. పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని అన్నదాతలకు తెలియజేయాలని సీఎం సూచించారు.

ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ. 1000 కోట్లను నిబంధనల ప్రకారం వినియోగించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement