త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EHS | ఈహెచ్ఎస్‌పై రేపు సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌

EHS | తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సోమ‌వారం సమీక్ష నిర్వహించనున్నారు.

S

Telangana | Published On May 31, 2026, 5.08 pm IST

EHS | ఈహెచ్ఎస్‌పై రేపు సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష‌
Advertisement

EHS | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న ఎంప్లాయిస్​ హెల్త్ స్కీమ్​ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సోమ‌వారం సమీక్ష నిర్వహించనున్నారు.

ఎంప్లాయి హెల్త్ కేర్​ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్‌కు సీఈవోగా నియమిస్తారు. ఈ కమిటీని రేపు ప్రకటించే అవకాశముంది.

ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్​ జారీ చేసింది. మే 31లోపు డేటా అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Advertisement
Advertisement