త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఆశా భోస్లే మ‌ర‌ణం కళా రంగానికి తీర‌ని లోటు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప్రముఖ గాయని, జాతీయ పురస్కార గ్రహీత, పద్మ విభూషణ్ ఆశా భోస్లే మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On Apr 12, 2026, 3.04 pm IST

CM Revanth Reddy | ఆశా భోస్లే మ‌ర‌ణం కళా రంగానికి తీర‌ని లోటు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ప్రముఖ గాయని, జాతీయ పురస్కార గ్రహీత, పద్మ విభూషణ్ ఆశా భోస్లే మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలు, దశాబ్దాల పాటు పలు భాషల్లో ప్రదర్శించిన అపూర్వ ప్రతిభ చిరస్మరణీయం. ఆమె మరణం దేశంలోని సాంస్కృతిక, కళారంగాలకు తీరని లోటు అని అన్నారు. ఆశా భోస్లే మరణం పట్ల ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ప్ర‌ముఖ గాయ‌ని ఆశా భోస్లే.. శ‌నివారం రాత్రి గుండెపోటుకు గుర‌వ‌డంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో కూడా ఆమె బాధ‌ప‌డుతున్నారు. ఐసీయూలో చికిత్స కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఆదివారం మ‌ధ్యాహ్నం ఆశా క‌న్నుమూశారు. భోస్లే మృతితో సంగీత ప్ర‌పంచం క‌న్నీటి సంద్ర‌మైంది.

Advertisement
Advertisement