త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Climate Week 2026 | ముంబై క్లైమెట్ వీక్‌కు సీఎం రేవంత్.. ప్రధాని మోదీతో ఒకే వేదికపై..!

ముంబై వేదికగా తెలంగాణ ప్రగతిని వినిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆహ్వానం మేరకు 3 రోజుల పాటు జరిగే 'ముంబై క్లైమెట్ వీక్'లో పాల్గొనేందుకు ఆయన మంగళవారం బయలుదేరారు. బుధవారం ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు.

J

Telangana | Published On Feb 17, 2026, 8.50 pm IST

Mumbai Climate Week 2026 | ముంబై క్లైమెట్ వీక్‌కు సీఎం రేవంత్.. ప్రధాని మోదీతో ఒకే వేదికపై..!
Advertisement

Mumbai Climate Week 2026 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబైకి బయలుదేరారు. మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 'ముంబై క్లైమెట్ వీక్' (Mumbai Climate Week) సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ప్రత్యేక ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 18 బుధవారం నుంచి ఆయన అధికారికంగా ఈ సదస్సులో పాల్గొంటారు.

తెలంగాణ విజయాలు ప్రపంచానికి

ముంబై క్లైమెట్ వీక్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ విస్తృత అభివృద్ధిని ఆయన వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలను అంతర్జాతీయ ప్రతినిధుల ముందు ఉంచనున్నారు.

సదస్సు విశేషాలు

ఫిబ్రవరి 17 నుంచి 19, 2026 వరకు మూడు రోజులు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో కన్వెన్షన్ సెంటర్ (Jio Convention Centre)లో ఈ సదస్సు జరగనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై కార్పొరేషన్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ అంతర్జాతీయ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించనున్నారు. పర్యావరణం, సుస్థిర అభివృద్ధి అంశాలపై జరిగే ఈ సదస్సులో తెలంగాణ గళాన్ని వినిపించేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు.

Advertisement
Advertisement