CM Revanth Reddy | గణపతి గారూ లొంగిపోండి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
CM Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆరోగ్య భద్రతకు, రక్షణకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆరోగ్య భద్రతకు, రక్షణకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కు శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది వీరులు నేలకొరిగారు. భూస్వాములు, జమీందార్లు పెత్తనం చలాయిస్తున్నప్పుడు నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ నక్సల్బరీ ఉద్యమంలో గద్దర్ లాంటి వారు బాట పట్టారు. ఇందిరా గాంధీ అసైన్మెంట్ యాక్ట్, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు అందించారు. దున్నేవాడికి భూమి అందించింది ఇందిరా గాంధీనే. రైతు కూలీలకు గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు జరిగితే కనీస మద్దతు ధర తీసుకొచ్చింది, రైతులను ఆదుకున్నది ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ. ఉపాధి హామీ చట్టాన్ని సోనియా గాంధీ తీసుకొచ్చారు. కనీసం మద్దతు ధర, ఉపాధి హామీ వంటి చట్టాలు తీసుకొచ్చారని సీఎం తెలిపారు.
అడవి బాట పట్టిన సోదరులందరికీ విజ్ఞప్తి చేశాం. మీ పోరాటం ఫలించింది.. ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయాయి..పెరిగాయి.. మీరు జనజీవన స్రవంతిలో కలవాలని కోరాం. ఆదివాసీ, మారుమూల గిరిజన గ్రామాల్లో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధి ఆగిపోతోంది.. ఆదివాసీ బిడ్డలకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చాం. మనం వచ్చిన తర్వాత 814 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ వచ్చారు. ఒకరిద్దరూ మిగిలిపోయారు. వాళ్లకు వయసు మీద పడ్డది. గణపతి.. వారికి విజ్ఞప్తి చేస్తున్నా.. మీ ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా సమస్యలను ప్రస్తావించండి.. పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం ముందుంటుంది. జనజీవన స్రవంతిలోకి రండి.. ఆర్థికంగా ఆదుకుంటుంది. గిరిదర్శక్ పేరు మీద.. గిరిజన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ గిరిజన బిడ్డలను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేసినప్పుడే నిజమైన ప్రజాపాలన అందించినట్టుగా భావిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



