త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Pawar | అజిత్ పవార్ మరణం పట్ల సీఎం రేవంత్‌, కేసీఆర్ ప్ర‌గాఢ సంతాపం

Ajit Pawar | మ‌హారాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ (Ajit Pawar) విమాన ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్య‌క్షుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR), మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు సంతాపం తెలిపారు.

G

Telangana | Published On Jan 28, 2026, 12.44 pm IST

Ajit Pawar | అజిత్ పవార్ మరణం పట్ల సీఎం రేవంత్‌, కేసీఆర్ ప్ర‌గాఢ సంతాపం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మ‌హారాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ (Ajit Pawar) విమాన ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు. నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్య‌క్షుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR), మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు సంతాపం తెలిపారు. అజిత్ మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం ప‌ట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి, తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆక‌స్మిక మ‌ర‌ణం ప్ర‌జా జీవితానికి తీర‌ని లోట‌న్నారు. ప‌వార్ కుటుంబానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు ప్ర‌గాఢ‌ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబానికి బ‌గ‌వంతుడు బ‌లాన్ని ఇవ్వాల‌ని ప్రార్థించారు.

రైతు ఉద్య‌మ నేత‌గా ప్ర‌జా జీవితాన్ని ప్రారంభించిన అజిత్‌: కేసీఆర్‌

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా తన ప్రజా జీవితాన్నిప్రారంభించి, మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగాఎదిగి, పలు హోదాల్లో పనిచేసిన అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మ‌హా రాజ‌కీయాల‌కు తీర‌ని లోటు: మంత్రి పొన్నం

మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయ‌న‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయ‌న‌ విశేష అనుభవం ఉన్న నేత అని చెప్పారు. ఈ విషాద సమయంలో పవార్ కుటుంబ సభ్యులకు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెంద‌డం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర రాజకీయాలలో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగి ఇటీవలే ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆయ‌న మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాన‌న్నారు.

మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల సేవ‌కు త‌న జీవితాన్ని అంకిత చేశారు: కేటీఆర్‌

బారామ‌తిలో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో అజిత్ ప‌వార్ మృతిచెంద‌డం ప‌ట్ల బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌తో బలమైన సంబంధాలు కలిగిన అనుభవజ్ఞుడైన నాయకుడిగా, మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి దశాబ్దాల పాటు ఆయ‌న‌ తన జీవితాన్ని అంకితం చేశారు. వారి కుటుంబ సభ్యులకు, సహచరులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అజిత్ మ‌ర‌ణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని చెప్పారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విషాద మరణం పట్ల బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాల‌ని ఆకాంక్షించారు.

అజిత్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడం త‌న‌ను దిగ్భ్రాంతికి, తీవ్ర బాధ‌కు గురిచేసింద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement