త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | న‌న్ను రేవంత్ ఉద్దీన్ అంటే దుఃఖం రాదా..? : తెలంగాణ సీఎం

CM Revanth Reddy | ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా.. కాస్త ఎమోష‌న్‌కు గురైన‌ట్లు స‌మాచారం. బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు త‌న‌ను రేవంత్ ఉద్దీన్‌గా సంబోధిస్తే నాకు దుఃఖం రాదా..? అని వ్యాఖ్యానించారు. న‌న్ను విమ‌ర్శించిన త‌ర్వాత‌నే కేసీఆర్‌ను కాపాడుతున్న కిష‌న్ రెడ్డిని కిష‌న్ రావుగా సంబోధించాన‌ని సీఎం అన్నారు.

S

Telangana | Published On Feb 12, 2026, 8.14 pm IST

CM Revanth Reddy | న‌న్ను రేవంత్ ఉద్దీన్ అంటే దుఃఖం రాదా..? : తెలంగాణ సీఎం
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా.. కాస్త ఎమోష‌న్‌కు గురైన‌ట్లు స‌మాచారం. బీజేపీ అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు త‌న‌ను రేవంత్ ఉద్దీన్‌గా సంబోధిస్తే నాకు దుఃఖం రాదా..? అని వ్యాఖ్యానించారు. న‌న్ను విమ‌ర్శించిన త‌ర్వాత‌నే కేసీఆర్‌ను కాపాడుతున్న కిష‌న్ రెడ్డిని కిష‌న్ రావుగా సంబోధించాన‌ని సీఎం అన్నారు.

మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా సీఎం అన్నారంటే..?

నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించను. నన్ను అన్న వాళ్ళనే నేను అంటున్నాను. పేరు మారిస్తేనే కిషన్ రెడ్డి దుఃఖపడితే.. నా మతం నా పేరు కూడా మార్చారు. నాకు దుఃఖం ఉంటుంది. వాళ్లు అన్నదానికే రిప్లై ఇచ్చాను అని సీఎం తెలిపారు.

ఓవైసీని కంట్రోల్ చేయ‌డానికి నేనెవ‌ర్ని..?

అస‌దుద్దీన్‌ ఓవైసీని కంట్రోల్ చేయడానికి నేనెవర్ని. బీజేపీ ఎక్కడ ఉంటే ఓవైసీ అక్కడ ఉంటాడు. నేను సిస్టంతో పని చేస్తాను. నేను కేసీఆర్‌ని కాదు, మోడీని కాదు.

ఆ కేసు ఆధారాలు ఎఫ్ఎస్ఎల్‌లో లేవు..

ఓటుకు నోటు కేసులో ఆధారాలేవి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌లో లేవు. కేసులను అప్పటికప్పుడే విశ్లేషణ చేసి నివేదికలు ఇస్తారు. 2021లోనే ఓటుకు నోటు కేసు ఆధారాలు స‌మ‌ర్పించాం. ప్రస్తుతం ఉన్న కేసులు అనాలసిస్ మాత్రమే ఉంటుంది. కావాలని విష ప్రచారం చేస్తున్నారు.

బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైద‌రాబాద్

హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్‌గా మార‌నుంది. ఈరోజు అశ్విని వైష్ణవిని కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పక్కన బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాం. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పక్కన‌ 600 ఎకరాల భూమిని కూడా పూలింగ్ చేస్తున్నాము. ఎయిర్‌పోర్టుని బుల్లెట్ ట్రైన్‌ని అనుసంధానం చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం. 2034 సంవత్సరంలోగా బుల్లెట్ ట్రైన్‌లు అందుబాటులోకి వస్తాయి.

రెండేండ్ల‌లో రెండు ఎయిర్‌పోర్టులు

జూన్ రెండు నాటికి తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్టుల ప‌నులు ప్రారంభమవుతాయి. వరంగల్‌, ఆదిలాబాద్‌లో శంకుస్థాపన చేస్తాం. రెండు సంవత్సరాలలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎయిర్‌పోర్టుకు సంబంధించి భూములను సేకరిస్తున్నామ‌ని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement