త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gurukula School | చెప్పిన‌ట్లు విన‌ట్లేద‌ని.. జూనియ‌ర్ల‌పై ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల దాడి..

Gurukula School | తాము చెప్పిన‌ట్లు విన‌డం లేద‌ని ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థులు జూనియ‌ర్ల‌పై దాడికిపాల్ప‌డిన ఘ‌ట‌న చొప్ప‌దండి మ‌హాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠ‌శాల‌లో (Gurukula School) చోటుచేసుకున్న‌ది.

G

Telangana | Published On Apr 5, 2026, 11.04 am IST

Gurukula School | చెప్పిన‌ట్లు విన‌ట్లేద‌ని.. జూనియ‌ర్ల‌పై ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల దాడి..
Advertisement

Gurukula School | త్రినేత్ర‌.న్యూస్‌: తాము చెప్పిన‌ట్లు విన‌డం లేద‌ని ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థులు జూనియ‌ర్ల‌పై దాడికిపాల్ప‌డిన ఘ‌ట‌న చొప్ప‌దండి మ‌హాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠ‌శాల‌లో (Gurukula School) చోటుచేసుకున్న‌ది. చొప్ప‌దండి బీసీ సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ను క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధ‌ర మండ‌ల కేంద్రంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో నైట్ డ్యూటీ ఉపాధ్యాయుడు, వాచ్‌మెన్ నిద్రిపోయిన త‌ర్వాత‌.. రెండో అంత‌స్తులో ఉండే ప‌దోత‌ర‌గ‌తికి చెందిన‌ 15 మంది విద్యార్థులు.. 8, 9వ తరగతులకు చెందిన 30 మంది విద్యార్థులపై విచక్షణారహితంగా చేతి కడియాలతో దాడులు చేశారు.

దీంతో భయంతో తొమ్మిదో తరగతి విద్యార్థి అనిరుధ్‌ మాధవన్‌ రెండో అంతస్తు నుంచి దూకి పారిపోయాడు. బాధిత విద్యార్థుల్లో ఒకరి పుట్టినరోజు కావడంతో అతడిని చూసేందుకు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చారు. దీంతో రాత్రి జరిగిన విషయాన్ని ఆ విద్యార్థి రోదిస్తూ త‌న‌ తల్లిదండ్రులకు తెలిపాడు. వారు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలిపి ఉపాధ్యాయులను నిలదీశారు. వారంతా పాఠశాలకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురుకులానికి చేరుకున్న‌ తహసీల్దార్ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు.

Advertisement
Advertisement