త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

City Civil Court | ఆ మొబైల్స్ కొనుగోళ్ల‌లో అవినీతి లేదు.. బీఆర్ఎస్ పార్టీకి కోర్టు మొట్టికాయ‌

City Civil Court | రాష్ట్ర ప్ర‌భుత్వం అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల‌కు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల ధ‌ర‌ల విష‌యంలో బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌క్కువ ధ‌ర‌కు వ‌చ్చే మొబైల్స్‌ను అధిక ధ‌ర‌కు కొనుగోలు చేసి అవినీతికి పాల్ప‌డ్డారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ.. త‌మ పార్టీ సోష‌ల్ మీడియాలో ఖాతాలో పోస్టులు చేసింది.

S

Telangana | Published On May 6, 2026, 6.45 pm IST

City Civil Court | ఆ మొబైల్స్ కొనుగోళ్ల‌లో అవినీతి లేదు.. బీఆర్ఎస్ పార్టీకి కోర్టు మొట్టికాయ‌
Advertisement

City Civil Court | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వం అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల‌కు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల ధ‌ర‌ల విష‌యంలో బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌క్కువ ధ‌ర‌కు వ‌చ్చే మొబైల్స్‌ను అధిక ధ‌ర‌కు కొనుగోలు చేసి అవినీతికి పాల్ప‌డ్డారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ.. త‌మ పార్టీ సోష‌ల్ మీడియాలో ఖాతాలో పోస్టులు చేసింది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మీద సంబంధిత శాఖ మంత్రి సీత‌క్క ప‌రువు న‌ష్టం దావా కేసు వేశారు. ఈ కేసులో సిటీ సివిల్ కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేస్తూ.. తక్షణమే సోష‌ల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశించింది.

అంగన్వాడీ మొబైల్ ఫోన్ కొనుగోళ్ల మీద, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంగా నిర్దారిస్తూ, తక్షణమే బీఆర్ఎస్ అకౌంట్ల నుంచి పోస్టుల‌ను తొలగించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ డాక్యుమెంట్స్ పరిశీలించిన కోర్టు, రూ. 30 కోట్లు అవినీతి అనే బీఆర్ఎస్ ఆరోపణ‌ల్లో ఏలాంటి వాస్త‌వం లేద‌ని తేల్చింది. టెండర్ నోటిఫికేషన్ నుండి చెక్ పేమెంట్ వరకు వివరాలను కోర్టు ప‌రిశీలించింది. మొబైల్ ఫోన్లు ఒకటి రూ. 11,650తో మొత్తం రూ. 44,42,14,500 కొనుగోలు చేయ‌గా.., రూ. 8499 విలువైన ఫోన్ రూ. 14,499 కొన్నారు అని బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా కోర్టు నిర్ధారించింది. సదరు ఆరోపణలు పిటిషినర్ సీతక్క ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అన్న వాదనతో కోర్టు ఏకీభ‌వించింది. త‌ప్పుడు ఆరోప‌ణ‌లతో కూడిన సోషల్ మీడియా పోస్టులను త‌క్షణం తొలగించాలని.. బీఆర్ఎస్, కేసీఆర్‌ను న్యాయ‌స్థానం ఆదేశించింది. ఫేస్ బుక్, ట్విట్లర్, ఇన్‌స్టాగ్రామ్ నుండి ఏప్రిల్ 10న చేసిన పోస్టులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సీత‌క్క త‌ర‌పున అడ్వ‌కేట్ నాగులూరి కృష్ణ కుమార్ వాద‌న‌లు వినిపించారు.

Advertisement
Advertisement