త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

సీఎం కుర్చీలో ఉండి ఫ్యాక్షన్ లీడర్‌లా మాట్లాడతారా? కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్ చేసిన రక్తపాత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On Jul 11, 2026, 8.59 pm IST

Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

సంక్షిప్త సారాంశం

"నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి" అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని ఒక ఫ్యాక్షన్ లీడర్‌లా అమానవీయ పదజాలం వాడటంపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక, ఇలాంటి హింసాత్మక వ్యాఖ్యలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని దేశపతి డిమాండ్ చేశారు.

Advertisement
  • సీఎం రేవంత్ ఫ్యాక్షన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్
  • సీఎంపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

Deshapati Srinivas | త్రినేత్ర.న్యూస్ : "నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి".. వినడానికే ఎంతో భయానకంగా ఉన్న ఈ మాటలు అన్నది సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ప్రతిపక్ష నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను ఉద్దేశించి సీఎం చేసిన ఈ హింసాత్మక వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బాధ్యతాయుతమైన సీఎం కుర్చీలో కూర్చుని ఫ్యాక్షన్ గద్దెపై ఉన్నట్లు మాట్లాడటం ఏంటని శాసనమండలి బీఆర్ఎస్ విప్ (Whip), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఇది ప్రజాస్వామ్యమా? ఫ్యాక్షనిజమా?

రాజకీయాల్లో సైద్ధాంతిక వైరుధ్యాలు సహజమే అయినా మాట్లాడే భాషలో కనీస సంస్కారం, విచక్షణ ఉండాలని దేశపతి శ్రీనివాస్ హితవు పలికారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఇంతటి క్రూరమైన, జుగుప్సాకరమైన పదజాలాన్ని వాడిన దాఖలాలు లేవన్నారు. కక్షసాధింపు చర్యలతో, రక్తపాత వ్యాఖ్యలతో తెలంగాణ (Telangana) సమాజంలో సీఎం హింసను ప్రేరేపించాలని చూస్తున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే..

ప్రభుత్వ చేతకానితనాన్ని సరిచేసుకుని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా వారి కష్టాలు తీర్చాలి కానీ.. ఇలా బూతులు తిడితే ఒరిగేది ఏమీ లేదని దేశపతి కౌంటర్ ఇచ్చారు. హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి ఇలాంటి క్రూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఈ రకమైన హింసాత్మక వైఖరిని ఏమాత్రం సహించరని ఆయన స్పష్టం చేశారు.

ఆ హంతకుడికి, సీఎంకు తేడా లేదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.. ఇటీవల సంచలనం సృష్టించిన దైవాలగూడ ఆరుగురి హత్యల కేసులోని హంతకుడి మనస్తత్వానికి, సీఎం మనస్తత్వానికి పెద్దగా తేడా లేదనిపిస్తోందని దేశపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి అనాగరిక మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన తప్పుకు తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ (Open apology) చెప్పాలని దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement