త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao Slams CM Revanth Reddy | రేవంత్‌కు, ఆ షాబాద్ హంతకుడికి తేడా లేదు

రైతులు నీళ్లు అడిగితే రక్తం పారించాలంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అయ్యారు.

J

Telangana | Published On Jul 11, 2026, 9.27 pm IST

Harish Rao Slams CM Revanth Reddy | రేవంత్‌కు, ఆ షాబాద్ హంతకుడికి తేడా లేదు

సంక్షిప్త సారాంశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హింసాత్మక వ్యాఖ్యలు ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు బెయిల్‌పై వచ్చి ఆరుగురిని చంపడం పూర్తిగా ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమేనని విమర్శించారు. శాంతిభద్రతల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం మళ్లీ కాళేశ్వరం, మేడిగడ్డ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులతో రైతుల పొలాలను ఎండబెడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు.

Advertisement
  • డైవర్షన్ పాలిటిక్స్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao Slams CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) రాజకీయాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీడియా సమావేశంలో చేసిన తాజా వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు సాగునీరు అడిగితే ప్రతిపక్ష నేతల రక్తం పారించాలని, బెల్టుతో కొట్టాలని సీఎం అనడం ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి (Sadistic mentality) అద్దం పడుతోందని మండిపడ్డారు. సీఎంకు, ఆరుగురిని బలితీసుకున్న షాబాద్ హంతకుడికి పెద్దగా తేడా లేదని సంచలన విమర్శలు చేశారు. ఇంతటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సీఎం వెంటనే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ నరమేధం ప్రభుత్వ వైఫల్యమే..

రాష్ట్రంలో శాంతిభద్రతలు (Law and order) పూర్తిగా క్షీణించాయని హరీశ్ రావు ఆరోపించారు. షాబాద్‌లోని దైవాలగూడలో జరిగిన ఆరుగురి హత్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ఒక పోక్సో (POCSO) కేసు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై (Bail) వచ్చిన ఆ మృగం.. ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, పసిపిల్లలు సహా ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా పట్టుకోలేకపోవడం హోంశాఖ చేతగానితనమే అన్నారు.

కాళేశ్వరం ఓ డైవర్షన్ డ్రామా..

ప్రభుత్వ వైఫల్యాలు, చేతగానితనం బయటపడిన ప్రతిసారీ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాలకు (Diversion dramas) తెరలేపుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. షాబాద్ ఘటనపై ప్రజాగ్రహం నుంచి తప్పించుకునేందుకే మళ్లీ కాళేశ్వరం (Kaleshwaram), మేడిగడ్డ, ఎన్డీఎస్ఏ (NDSA) అంశాలను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అబ్రహం లింకన్ చెప్పినట్లుగా "కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయవచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు" అన్న విషయం సీఎం గుర్తించుకోవాలని హితవు పలికారు.

రైతుల పొలాలు ఎండబెడుతున్నారు..

రిటైర్డ్ ఇంజనీర్లు, ప్రతిపక్షాలు గోదావరి జలాలను లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాలని మొత్తుకుంటున్నా.. సీఎం మాత్రం తన రాజకీయ క్షుద్ర ప్రయోజనాల కోసం రైతుల పొలాలను ఎండబెడుతున్నారని హరీశ్ ఫైర్ అయ్యారు. "నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వాడిని లేపలేము" అంటూ ఎద్దేవా చేశారు. కేవలం కక్ష సాధింపు చర్యలకే పరిమితమైన ఈ చేతకాని ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తెలంగాణ రైతులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హరీశ్ రావు హెచ్చరించారు.

Advertisement
Advertisement