త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు

Telangana | తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు చేస్తున్న‌ట్లు పంచాయ‌తీ రాజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

S

Telangana | Published On Dec 23, 2025, 5.32 pm IST

Telangana | ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు

Gram Panchayat

Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ఎన్నికైన సర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు చేస్తున్న‌ట్లు పంచాయ‌తీ రాజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో స‌ర్పంచ్, ఉప స‌ర్పంచ్‌లకు చెక్ ప‌వ‌ర్ అవ‌కాశం క‌ల్పించారు. కానీ రేవంత్ రెడ్డి స‌ర్కార్ మాత్రం కేవ‌లం స‌ర్పంచ్ ఒక్క‌రికే చెక్ ప‌వ‌ర్ క‌ల్పిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేవంత్ నిర్ణ‌యంపై ఉప స‌ర్పంచ్‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటీవ‌లి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఉప స‌ర్పంచ్ పోస్టుకు భారీ డిమాండ్

2025 పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఉప స‌ర్పంచ్ పోస్టుకు భారీ డిమాండ్ ఉండే. ఎందుకంటే జాయింట్ చెక్ ప‌వ‌ర్ ఉండ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. అంటే స‌ర్పంచ్, ఉప స‌ర్పంచ్ సంత‌కం చేస్తేనే బిల్లులు మంజూరీకి అవ‌కాశం ఉండే. కానీ తాజాగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంతో ఉప స‌ర్పంచ్‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎన్నిక‌ల్లో గెలిచి, ఉప స‌ర్పంచ్ ప‌ద‌విని ద‌క్కించుకున్నామ‌ని, తీరా చూస్తే త‌మ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

జాయింట్ చెక్ ప‌వ‌ర్ అంటే..?

ఈ విధానంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి నిధుల విడదల, చెల్లింపుల విషయంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. దీనినే సాధారణంగా 'జాయింట్ చెక్ పవర్' అని పిలుస్తారు. ఈ జాయింట్ చెక్ పవర్ సిస్టమ్ రద్దు చేసింది రేవంత్ సర్కార్.

2018 నుంచి ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్

2014లో అధికారంలోకి వ‌చ్చిన నాటి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం.. 2018లో కొత్త పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింది. ఆ చ‌ట్టంలో స‌ర్పంచ్‌, ఉప స‌ర్పంచ్‌కు జాయింట్ చెక్ ప‌వ‌ర్ క‌ల్పించింది. 2019 జ‌న‌వ‌రి నెల‌లో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల అనంత‌రం జాయింట్ చెక్ ప‌వ‌ర్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమ‌ల్లోకి వ‌చ్చింది.

Gram Panchayat

2018కు ముందు ఇలా..

2018 పంచాయ‌తీ రాజ్ చ‌ట్టానికి ముందు.. గ్రామ పంచాయ‌తీల నిధుల చెల్లింపుల కోసం స‌ర్పంచ్‌తో పాటు పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి సంత‌కాలు అవ‌స‌ర‌మ‌య్యేవి. అయితే, అధికారుల కంటే ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులకే ఎక్కువ బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌కు చెక్ ప‌వ‌ర్ తీసేసి, వారి స్థానంలో ఉప స‌ర్పంచ్‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement