త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు లేఖ ఇచ్చార‌ని తెల్వ‌దా.. టీడీపీ ఎంపీని ప్ర‌శ్నించిన చామ‌ల‌

Chamala Kiran Kumar Reddy | తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేంద్రానికి లేఖ ఇచ్చిన విష‌యం ఆ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలకు తెలియదా అని భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ప్ర‌శ్నించారు.

G

Telangana | Published On Mar 11, 2026, 1.05 pm IST

Chamala Kiran Kumar Reddy | తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు లేఖ ఇచ్చార‌ని తెల్వ‌దా.. టీడీపీ ఎంపీని ప్ర‌శ్నించిన చామ‌ల‌
Advertisement

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కేంద్రానికి లేఖ ఇచ్చిన విష‌యం ఆ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలకు తెలియదా అని భువ‌న‌గిరి కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) ప్ర‌శ్నించారు. లోక్ సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీకృష్ణ దేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లోక్ సభలో తలుపులు మూసి బిల్లు పాస్ చేశారన్నార‌ని, 2014, ఫిబ్ర‌వ‌రి 14 బ్లాక్ డే అన‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కానీ రాజ్యంగబద్దంగా తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింద‌ని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయ‌ని, సుష్మా స్వరాజ్ లోక్‌సభలో తెలంగాణ గురించి మాట్లాడారని బీజేపీ వాళ్లు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి లోక్‌సభలో టీడీపీ ఎంపీ తెలంగాణ గురించి మాట్లాడారని విమ‌ర్శించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏండ్లు గడుస్తున్నాయ‌ని, ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టడం ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ, బీహార్ ప్రజలు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే వారు మోడీకి మద్దతు ఇస్తున్నార‌ని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి సత్సంబంధాలతో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రను టీడీపీ ఎంపీ తప్పుగా మాట్లాడటం సరికాద‌న్నారు. ఎవరి ప్రసన్నం కోసమో ప్రజల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టకూడ‌ద‌ని సూచించారు. లావు శ్రీ కృష్ణ దేవరాయలు అవగాహన ఉండి మాట్లాడారా లేదా అవగాహన లేక మాట్లాడారా టీడీపీ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై మళ్లీ చర్చ పెట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కిరణ్ రిజిజును టీడీపీ ఎంపీ అడిగారని, 2014 రాష్ట్ర విభజన సమయంలో లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఏ వ్యాపారంలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో తెలియద‌ని విమ‌ర్శించారు. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని హెచ్చ‌రించారు. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు సృష్టించవద్దన్నారు. లోక్‌సభ‌లో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడవద్ద‌ని చెప్పారు.

Advertisement
Advertisement