త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్‌.. ఇప్ప‌టికైనా పిచ్చి మాట‌లు బంద్ చేయ్‌: ఎంపీ చామ‌ల‌

Chamala Kiran Kumar Reddy | సీఎం రేవంత్ రెడ్డి సోద‌రులు భూకుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతున్నారంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిప‌డ్డారు. తన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడొద్దని కేటీఆర్ భావిస్తున్నారని విమ‌ర్శించారు.

G

Telangana | Published On Aug 12, 2026, 12.35 pm IST

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్‌.. ఇప్ప‌టికైనా పిచ్చి మాట‌లు బంద్ చేయ్‌: ఎంపీ చామ‌ల‌
Advertisement

Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి సోద‌రులు భూకుంభ‌కోణాల‌కు పాల్ప‌డుతున్నారంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) మండిప‌డ్డారు. తన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడొద్దని కేటీఆర్ భావిస్తున్నారని విమ‌ర్శించారు. కేటీఆర్ ఇక‌నైనా పిచ్చి మాట‌లు మానుకోవాల‌న్నారు. ఉద్యమ సమయంలో త‌న‌ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రార‌ని కేసీఆర్ (KCR) చెప్పార‌ని గుర్తుచేశారు. 1600 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలోనే 5 ఉద్యోగాలు వచ్చాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

`అమెరికా నుంచి వచ్చిన‌ కేటీఆర్ మంత్రి అయ్యారు. ఎమ్మెల్యే కాకుండా హరీశ్‌ రావు (Harish Rao) మంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ఐదుగురు అన్న, దమ్ముళ్లకు ఏ పదవి అయినా ఇచ్చే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ (BRS) పాలనలో ఇచ్చినట్లు తన కుటుంబంలో పదవులు ఇచ్చుకోలేదు. అందరికి ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి సోదరునికి అప్లికేషన్ పెట్టుకుంటే భూమి కేటాయించారు.` అని చెప్పారు.

పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేద‌ని మండిప‌డ్డారు. కాళేశ్వరంలో దండుకోవాలన్న ఆలోచనతో పాలమూరు, రంగారెడ్డిని ఆ పార్టీ పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ (Telangana) ప్రజలు బాగుపడవద్దని కేటీఆర్ భావిస్తున్నారని విమ‌ర్శించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరికి భూములు ఇచ్చారో, ఏ దోస్తులకు, కంపెనీలు కట్టబెట్టారో త‌మ‌కు అంతా తెలుసని చెప్పారు. కుటుంబంలో పంపకాలు తేడా వచ్చి కవిత కొత్త పార్టీ పెట్టార‌న్నారు. ఇప్పటికైనా కేటీఆర్ పిచ్చి మాటలు బంద్ చేయాల‌ని హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement