త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Grama Panchayats | గ్రామ‌పంచాయ‌తీల‌కు మ‌రో రూ.387 కోట్లు.. మూడో విడ‌త‌ 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల

Grama Panchayats | గ్రామ పంచాయతీలకు (Grama Panchayats) 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడ‌తగా రూ.387.53 కోట్లు విడుద‌ల చేసింది.

G

Telangana | Published On Feb 20, 2026, 11.44 am IST

Grama Panchayats | గ్రామ‌పంచాయ‌తీల‌కు మ‌రో రూ.387 కోట్లు.. మూడో విడ‌త‌ 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల
Advertisement

Grama Panchayats | త్రినేత్ర‌.న్యూస్‌: గ్రామ పంచాయతీలకు (Grama Panchayats) 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడ‌తగా రూ.387.53 కోట్లు విడుద‌ల చేసింది. రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు ఆల‌స్య‌మ‌వ‌డంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుద‌ల జాప్యం అయింది. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి రూ.3000 కోట్లు చెల్లించాల్సి ఉన్న‌ది. గ‌త డిసెంబ‌ర్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగియ‌డంతో విడ‌త‌ల వారీగా చెల్లింపులు చేస్తున్న‌ది.

తొలివిడ‌త‌గా ఫిబ్ర‌వ‌రి 5న రూ.259.36 కోట్లు విడుద‌ల చేసింది. ఈ నెల 13న మ‌రో రూ.387 కోట్లు రిలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.387.53 కోట్ల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు రూ.1034.42 కోట్లు విడుదల చేసిన‌ట్ల‌యింది. మ‌రో రూ. 2000 కోట్లు కేంద్రం బాకీ ఉన్న‌ది.

కాగా, పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కేంద్రం విడుదల చేసిన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తిచేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్టు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement