త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

15th Finance Commission | గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

15th Finance Commission | త్రినేత్ర‌.న్యూస్‌: గ్రామ పంచాయితీలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రామా పంచాయ‌తీల్లో పాల‌కవ‌ర్గాల ఏర్పాటుతో 15వ ఆర్థిక సంఘం నిధులను (15th Finance Commission) విడుదల చేసింది.

G

Telangana | Published On Feb 5, 2026, 1.13 pm IST

15th Finance Commission | గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
Advertisement

15th Finance Commission | త్రినేత్ర‌.న్యూస్‌: గ్రామ పంచాయితీలకు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రామా పంచాయ‌తీల్లో పాల‌కవ‌ర్గాల ఏర్పాటుతో 15వ ఆర్థిక సంఘం నిధులను (15th Finance Commission) విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఇప్పటికే నిధులు విడుదల కావాల్సి ఉన్న‌ది. అయితే పంచాయతీల పదవీ కాలం ముగిసిన‌ప్ప‌టికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావడం, పాల‌క వ‌ర్గాలు కొలువుదీర‌డం పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సంప్రదింపులతో నిధుల విడుదలకు మార్గం సుగ‌మ‌మైంది. మొత్తం రూ.3 వేల‌ కోట్ల వరకు రాష్ట్రానికి రావాల్సి ఉన్న‌ది. తొలి విడతగా రూ.259.36 కోట్లు మాత్ర‌మే ప్ర‌భుత్వం విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు (సర్పంచ్‌లు) ఉంటేనే ఈ నిధులను నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. ఇటీవల ఎన్నికలు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. పంచాయతీలకు అందిన ఈ నిధులను ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా అవసరాల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఖర్చు చేయనుంది. కాగా, తొలి విడత నిధులు విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్య‌క్తం చేశారు. మిగతా పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

 

Advertisement
Advertisement